తాజ్‌మహల్‌.. సందర్శకులకు నో ఎంట్రీ!

ఆగ్రా: భారత్ లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కుటుంబంతో సహా ఈ సాయంత్రం తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. దీంతో ఇప్పటికే భద్రత ఏర్సాట్లు చేసిన అధికారులు సందర్శకులను మాత్రం మధ్యాహ్నం వరకు మాత్రమే అనుమతించనున్నారు. 

Updated : 24 Feb 2020 12:20 IST

 

ఆగ్రా: భారత్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కుటుంబంతో సహా ఈ సాయంత్రం ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. దీంతో ఇప్పటికే భద్రత ఏర్పాట్లు చేసిన అధికారులు.. సందర్శకులను మాత్రం మధ్యాహ్నం వరకు మాత్రమే అనుమతించనున్నారు. ఉదయం 11.30గంటలలోపు టికెట్‌ తీసుకున్నవారినే అనుమతిస్తామని అధికారులు తెలియజేశారు. భద్రత కారణాల దృష్ట్యా మధ్యాహ్నం నుంచి తాజ్‌మహల్‌లో సందర్శకులు ఎవరూ లేకుండా చూస్తామని తెలిపారు. ఈ సాయంత్రం 5.15  గంటలకు ట్రంప్‌ దంపతులు తాజ్‌మహల్‌ను సందర్శించి గంటపాటు ఇక్కడ గడిపే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రాతో పాటు తాజ్‌మహల్ పరిసరాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని