ఆ అంశంపై మోదీతో చర్చించలేదు: ట్రంప్
భారత్లో తన రెండు రోజుల పర్యటన మధురానుభూతిని కలిగించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన..
దిల్లీ: భారత్లో తన రెండు రోజుల పర్యటన మధురానుభూతిని కలిగించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక బంధాలపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. భారత్ అద్భుతమైన దేశమనీ.. ప్రధాని మోదీతో బలమైన మైత్రి ఏర్పడిందన్నారు. భారత కంపెనీల సీఈవోలతో సమావేశం సంతృప్తికరంగా సాగిందని చెప్పారు. బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టే సమర్థులు భారత్లో ఉన్నారన్నారు. అఫ్గాన్లో శాంతి నెలకొనాలనేదే తమ ప్రయత్నమని ట్రంప్ చెప్పారు. అక్కడ 19 ఏళ్లుగా శాంతి స్థాపన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడుతున్నామే తప్ప అమాయకుల్ని లక్ష్యంగా చేసుకోవడంలేదని అగ్రరాజ్యాధిపతి స్పష్టంచేశారు. అఫ్గాన్లో శాంతి నెలకొనాలని భారత్ కూడా కోరుకుంటోందని ట్రంప్ గుర్తు చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో తాను చేసినంత కృషి మరెవరూ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. అఫ్గానిస్థాన్, ఇరాన్లో తమ బలగాలను తగ్గిస్తున్నామని చెప్పారు.
మత స్వేచ్ఛ ఉండాలని మోదీ కోరుకుంటున్నారు
వేలాది మంది అమాయకులను ఐసిస్ ఉగ్రవాద సంస్థ బలితీసుకుందని ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. అలాంటి ఐసిస్ను తుదముట్టించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. అల్ బగ్దాదీ, సులేమానీ, హమ్జద్ లాడెన్ చనిపోయారన్నారు. భారత్లో మత స్వేచ్ఛ పరిరక్షణకు మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్నారు. ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉండాలని మోదీ కోరుకుంటున్నారనీ.. ఇవాళ్టి మాటామంతిలోనూ మోదీ దాని గురించి ప్రస్తావించారని వెల్లడించారు. ‘గతంలో ఈ దేశంలో ముస్లింలు 14 కోట్లమంది ఉండేవాళ్లు.. ప్రస్తుతం ఆ సంఖ్య 20 కోట్లు దాటిందని మోదీ నాతో చెప్పారు. ముస్లింలకు స్వేచ్ఛ, రక్షణ ఉందనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. భారత్ భవిష్యత్తులో ఆర్థికంగా సామాజికంగా మరింత పురోగమిస్తుంది. నైపుణ్యాలు అందిపుచ్చుకొనేందుకు భారత యువత ఎంతో కృషిచేస్తున్నారు. వచ్చే 50 ఏళ్లలో భారత్ దిగ్గజంగా నిలుస్తుంది’’ భారత్లో జరుగుతున్న కొన్ని ఘటనలు ఈ దేశ అంతర్గతమని.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి ప్రధాని మోదీతో తాను చర్చించలేదని ట్రంప్ స్పష్టంచేశారు.
అది భారత్ అంతర్గత విషయం..
కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై మాట్లాడేందుకు ఏమీ లేదనీ.. అది భారత్ అంతర్గత విషయమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ‘‘పాక్ ప్రధాని ఇమ్రాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. పాక్ నుంచి ఉగ్ర ముప్పుపై మోదీ తగిన జాగ్రత్తలు తీసుకోగలరు. మోదీ దృఢమైన వ్యక్తి.. కశ్మీర్ అంశాన్ని ఆయన చూసుకోగలరు. మోదీ మాటల్లోనే కాదు.. చేతల్లోనూ దృఢంగా ఉంటారు. భారత్ పాకిస్థాన్ మధ్య కొన్ని అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇరు దేశాలు కోరుకుంటే మధ్యవర్తిత్వానికి సిద్ధమని గతంలోనే చెప్పాను. కశ్మీర్ వివాదంలో చాలా సంక్లిష్టమైన అంశాలు ఉన్నాయి. ప్రతి కథకు రెండు పార్శ్వాలు ఉంటాయి’’ అని ట్రంప్ వివరించారు.
వాణిజ్య లోటులో సానుకూలంగా ఉండాలి
భారత్తో వాణిజ్య ఒప్పందాల విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. ‘‘భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేస్తున్న ద్విచక్రవాహనాలపై అదనపు సుంకాలు లేవు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే ద్విచక్రవాహనాలపై భారీగా పన్ను వేస్తున్నారు. అమెరికాతో భారత్ వాణిజ్య లోటు 30 బిలియన్ డాలర్లు ఉంది. కొంత కాలంగా అది 24 బిలియన్ డాలర్లకు తగ్గింది. భారత్ మంచి మిత్ర దేశమే.. కానీ వాణిజ్య లోటులో సానుకూలంగా ఉండాలని కోరుతున్నా. ఇంధన రంగంలో ఇరుదేశాల మైత్రి మరింత విస్తరిస్తోంది’’ అని ట్రంప్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి