చైనా, జపాన్ నుంచి భారతీయుల తరలింపు
కరోనా వైరస్ ప్రభావంతో జపాన్లోని డైమండ్ ప్రిన్సెస్ నౌకలో చిక్కుకొన్న 119 భారతీయులు ఎయిరిండియా ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం దిల్లీకి చేరుకొన్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగశాఖ....
దిల్లీ: కరోనా (కొవిడ్-19) వైరస్ ప్రబలిన జపాన్లోని డైమండ్ ప్రిన్సెస్ నౌకలో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించారు. వీరిని ఎయిరిండియా ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం దిల్లీకి తరలించారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ ట్విటర్లో ప్రకటించారు. ‘‘కొవిడ్ ప్రభావంతో జపాన్లోని డైమండ్ ప్రిన్సెస్ నౌకలో చిక్కుకొన్న 119 మంది భారతీయులతో సహా శ్రీలంక, నేపాల్, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన ఐదుగురిని టోక్యో నుంచి ఎయిరిండియా ప్రత్యేక విమానంలో నేడు దిల్లీకి తీసుకొచ్చాం. వీరిని తరలించేందుకు ఏర్పాట్లు చేసిన జపాన్ అధికారులకు ధన్యవాదాలు, మరోసారి ఎయిరిండియాకు కృతజ్ఞతలు’’ అని ట్వీట్ చేశారు.
ఫిబ్రవరి 5వ తేదీన జపాన్కు చెందిన డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ఓ ప్రయాణికుడికి కరోనా సోకినట్లు గుర్తించారు. అప్పటికి ఈ నౌకలో 3,711 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 138 భారతీయులు ఉండగా వారిలో 132 మంది సిబ్బంది మరో ఆరుగురు ప్రయాణికులు. వీరిలో 16 మందికి కరోనా సోకగా వారిని జపాన్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా మిగిలిన వారిని భారత్కు తరలించారు.
వుహాన్ నుంచి భారతీయలు తరలింపు
మరోపక్క కరోనాతో అతలాకుతలం అవుతున్న చైనాకు భారత్ సాయం అందించింది. 15 టన్నుల వైద్య పరికరాలతో కూడిన వాయుసేన ప్రత్యేక విమానాన్ని బుధవారం చైనాలోని వుహాన్కు పంపింది. తిరుగు ప్రయాణంలో అక్కడ చిక్కుకొన్న 80 మంది భారతీయులు, 40 మంది విదేశీయులను భారత్కు తీసుకొచ్చినట్లు విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వీరందరిని దిల్లీలోని చావ్లా ప్రాంతంలో భారత్-టిబెట్ సరిహద్దు భద్రత దళం (ఐటీబీపీ) ఏర్పాటు చేసిన కేంద్రానికి తరలించి పరీక్షలు నిర్వహించనున్నారు.
తాజాగా దక్షిణ కొరియాలో మరో 334 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో ఇప్పటి వరకు ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 1595కు చేరింది. వీరిలో 12 మంది మృత్యువాత పడ్డారు. చైనా తర్వాత అధికంగా కరోనా బాధితులు నమోదవుతోంది ఇక్కడే. చైనాలో బుధవారం మరో 433 మందికి కరోనా సోకగా 29 మంది మృత్యువాతపడ్డారు. దీంతో కరోనాతో మృతుల సంఖ్య 2,744కి చేరింది. పొరుగు దేశం పాకిస్థాన్లో ఇద్దరికి కరోనా సోకినట్లు గుర్తించారు. అగ్ర రాజ్యం అమెరికాలో కూడా కరోనా వ్యాపించింది. దీంతో ఆ దేశం చర్యలకు ఉపక్రమించింది. భారత పర్యటన అనంతరం అమెరికాకు చేరుకొన్న అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితిని సమీక్షించారు. ఉపాధ్యక్షడు మైక్పెన్స్ నేతృత్వంలో అధికారుల బృందం కరోనా నిరోధక చర్యలపై పనిచేస్తుందని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు