కరోనా రుజువైతే లక్ష రివార్డు..!
షాంఘై: చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో దీన్ని గుర్తించేందుకు లక్షలాది మంది అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.
వైరస్ సోకిన వారికి నగదు అందిస్తోన్న చైనా అధికారులు
షాంఘై: చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో దీన్ని గుర్తించేందుకు లక్షలాది మంది అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. వేగంగా విస్తరిస్తోన్న కరోనాను ఆదిలోనే గుర్తించి కట్టడి చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ వుహాన్ వంటి చాలా ప్రాంతాల్లో అసాధారణ పరిస్థితుల దృష్ట్యా అక్కడి ప్రజలు ఆలస్యంగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు గుర్తించారు అధికారులు. అయితే లక్షణాలున్న వారిని వీలైనంత తొందరగా గుర్తించి వైద్య పరీక్షలు చేయాలని..ఇలా స్వచ్ఛందంగా వచ్చే వారికి నగదు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. వైరస్ లక్షణాలున్నట్లు అధికారులకు తెలియజేసినా కూడా నగదు అందజేసి ఉచిత వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వుహాన్ పరిసర ప్రాంతాల్లోని హాన్యాంగ్, హౌంగ్గవాంగ్తో పాటు చాలా పట్టణాలు 500నుంచి వెయ్యి యువాన్లను రివార్డుగా అందిస్తున్నారు.
తాజాగా ఈ జాబితాలోకి వుహాన్కు 150కి.మీ దూరంలో ఉన్న క్వైన్జియాంగ్ పట్టణం కూడా చేరింది. కరోనా లక్షణాలున్న వారు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, ఇలా వచ్చిన వ్యక్తులకు వైరస్ ఉన్నట్లు రుజువైతే వారికి 10వేల యువాన్లు (దాదాపు లక్ష రూపాయలు)లను ఇస్తామని ప్రకటించింది. అయితే, ఇప్పటికే చికిత్స చేయించుకుంటున్న వారికి మాత్రం ఇది వర్తించదని తెలిపింది. అంతేకాదు, వైరస్ అనుమానిత వ్యక్తికి కూడా దాదాపు 2వేల యువాన్లు ఇస్తామని ప్రకటించింది. కరోనా లక్షణాలున్న వారు స్వయంగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ రివార్డును ప్రకటిస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. చైనా వ్యాప్తంగా 2700మంది చనిపోవడంతోపాటు, వేల మందికి సోకిన ఈ వైరస్ వ్యాప్తిని ఆదిలోనే అరికట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడి అధికారులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.