మెలానియా కళ్లల్లో మెదులుతున్న దిల్లీ విద్యార్థులు..!
దిల్లీలో సర్వోదయ పాఠశాలలో హ్యాపీనెస్ తరగతులకు హాజరైన అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఆ జ్ఞాపకాల్ని మరచిలేకపోతున్నారు. ఆమె నిర్వహిస్తున్న ‘బీ బెస్ట్’ స్వచ్ఛంద కార్యక్రమ లక్ష్యాలకు.........
సర్వోదయ పాఠశాల సందర్శన అనుభూతుల్ని గుర్తుచేసుకున్న ప్రథమ మహిళ
వాషింగ్టన్: దిల్లీలో సర్వోదయ పాఠశాలలో హ్యాపీనెస్ తరగతులకు హాజరైన అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఆ జ్ఞాపకాల్ని మరచిలేకపోతున్నారు. ఆమె నిర్వహిస్తున్న ‘బీ బెస్ట్’ స్వచ్ఛంద కార్యక్రమ లక్ష్యాలకు హ్యాపీనెస్ తరగతుల ఆశయం దగ్గరగా ఉండడం ఆమెని అమితంగా ఆకట్టుకుంది. ‘బీ బెస్ట్’ కార్యక్రమం అనేక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అమలవుతోందంటూ ఆనందం వ్యక్తం చేశారు. భారత సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికినందుకు పాఠశాలకు కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్లో విద్యార్థులతో గడిపిన క్షణాలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయంటూ పిల్లలపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. గురువారం ట్విటర్ వేదికగా తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ‘‘భారత సంప్రదాయ పద్ధతిలో నుదుట తిలకం దిద్ది, హారతి ద్వారా నాకు స్వాగతం పలికినందుకు సర్వోదయ పాఠశాలకు కృతజ్ఞతలు. అద్భుత ప్రతిభ కలిగిన విద్యార్థులు, బోధనా సిబ్బంది మధ్య ఉండే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. పాఠశాలలో గడిపిన క్షణాలన్నీ చిరస్మరణీయం’’ అంటూ మెలానియా సర్వోదయ పాఠశాల సందర్శనను గుర్తుచేసుకున్నారు.
మెలానియా స్పందనపై సర్వోదయ పాఠశాల ఉపాధ్యాయురాలు మను గులాటీ ప్రతిట్వీట్ చేశారు. ప్రథమ మహిళ పాఠశాలకు రావడం తమ జీవితాల్లో ఎప్పటికీ మరచిపోలేని సందర్భం అని వ్యాఖ్యానించారు. తమ హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందంటూ అనుభూతిని పంచుకున్నారు. పాఠశాల పర్యటన జ్ఞాపకాలను మెలానియా ట్విటర్లో పంచుకోవడం విద్యార్థులకు ఇచ్చిన అతిపెద్ద బహుమానం అని వ్యాఖ్యానించారు. ప్రథమ మహిళ పర్యటన తమలో కొత్త ఆశయాల్ని, కలల్ని చిగురింపజేసిందన్నారు. నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. ప్రతి పిల్లవాడిని మరింత సంతోషంగా, దయాహృదయులుగా, హుషారుగా మార్చేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
గులాటీ వ్యాఖ్యలపై మెలానియా తిరిగి స్పందించారు. సర్వోదయ పాఠశాల పిల్లల్లోని ఆత్మవిశ్వాసం, వారి ముఖాల్లోని సంతోషం తనని ఆనందానికి గురిచేసిందన్నారు. అలాంటి వారికి గురువుగా ఉన్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్లోని ‘‘రీడింగ్ క్లాస్రూం, హ్యాపీనెస్ కరికులం’’తో స్ఫూర్తి పొందానన్నారు. ‘‘బీ బెస్ట్ ఆశయాలు అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమలవుతుండడం ఆనందంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనలో భాగంగా మెలానియా దిల్లీలోని సర్వోదయ పాఠశాలను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడ అమలవుతున్న హ్యాపీనెస్ తరగతుల్ని పరిశీలించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక తరగతుల్ని వీక్షించారు. పిల్లలతో కలిసిపోయి వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ, ఆలింగనం చేసుకుంటూ వారిని ఉత్సాహపరిచారు. సంప్రదాయ పద్ధతిలో బొట్టుపెట్టి, హారతి ద్వారా స్వాగతం పలకడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరిగి పర్యటన ముగించుకొని అమెరికా వెళ్లిన ఆమె ఇక్కడి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు.
పిల్లల ఆనందమే లక్ష్యంగా ‘బీ బెస్ట్’...
పిల్లలు తమ తమ మార్గాల్లో పయనించేందుకు నాణ్యమైన మార్గనిర్దేశం చేయడానికి ప్రారంభించిన కార్యక్రమమే ‘బీ బెస్ట్’. మే 7, 2018న మెలనియా దీనికి శ్వేతసౌధంలో శ్రీకారం చుట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్ని ‘బీ బెస్ట్’డేగా ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు, యువకుల్లో ఆన్లైన్ వేధింపులు, డ్రగ్స్ వాడకం దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే భౌతికంగా, మానసికంగా దృఢంగా ఉంటూ తమ లక్ష్యఛేదనలో ముందుకు ఎలా సాగాలో వివిధ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ