విమానంలో పావురాలు హల్చల్..!
అహ్మదాబాద్: ఆకాశంలో వెలుతున్న విమానాలకు పక్షులు అడ్డురావడం సాధారణమే. అయితే తాజాగా ఓ విమానం లోపలికి రెండు పావురాలు వచ్చి హల్చల్ చేసిన ఘటన అహ్మదాబాద్లో చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నుంచి జైపూర్ వెళ్ళెందుకు గోఎయిర్ విమానం టేకాఫ్ కోసం సిద్ధమయ్యింది.
అహ్మదాబాద్: విమానాలకు అప్పుడప్పుడు పక్షులు అడ్డురావడం సాధారణమే. అయితే తాజాగా ఓ విమానంలోకి రెండు పావురాలు వచ్చి హల్చల్ చేసిన ఘటన అహ్మదాబాద్లో చోటుచేసుకుంది. తాజాగా అహ్మదాబాద్ నుంచి జైపూర్ వెళ్ళే గోఎయిర్ విమానం టేకాఫ్ కోసం సిద్ధమయ్యింది. అప్పటికే ప్రయాణికులందరూ తమ తమ సీట్లలో కూర్చోగా, ఓ ప్రయాణికుడు తన బ్యాగు ఉంచేందుకు పైన ఉన్న లగేజీ క్యాబిన్ను తెరిచాడు. అందులోనుంచి రెండు పావురాలు ఒక్కసారిగా వచ్చాయి. టేకాఫ్కు సిద్దంగా ఉన్న సమయంలో ఆ రెండు పావురాలు విమానంలోనే అటూ ఇటూ చక్కర్లు కొట్టడం ప్రారంభించాయి. విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు వీటిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వారికి దొరకకుండా హడావుడి చేశాయి. పావురాల అల్లరి చూస్తూన్న కొందరు ప్రయాణికులు వీడియోలు తీయగా, మరికొందరు మాత్రం వాటికి కూడా బోర్డింగ్ పాస్ ఇవ్వాలంటూ చలోక్తులు విసిరారు. చివరకు విమాన సిబ్బంది ఆ రెండు పావురాలను బయటికి పంపించివేయడంతో ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం దాదాపు 30నిమిషాల ఆలస్యంగా విమానం బయలుదేరింది. ఓ ప్రయాణికుడు ఈ వీడియోని ట్విటర్లో పోస్టు చేయడంతో ప్రస్తుతం సామాజిక మాథ్యమాల్లో వైరల్ అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!