పోప్‌నూ వదలని కరోనా భయం

దగ్గు, జలుబు కారణంగా వారం రోజుల పాటు రోమ్‌ ప్రాంతంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనబోవడంలేదని క్రైస్తవుల మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆదివారం ప్రకటించారు. 2013లో పోప్‌గా.....

Updated : 02 Mar 2020 18:25 IST

వాటికన్ సిటి: దగ్గు, జలుబు కారణంగా వారం రోజుల పాటు రోమ్‌ ప్రాంతంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనబోవడంలేదని రోమన్‌ క్యాథలిక్‌ల మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆదివారం ప్రకటించారు. 2013లో పోప్‌గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి అనారోగ్య కారణాలతో సమావేశాలకు హాజరు కాకపోవడం ఇదే తొలిసారి. ఇటలీలో కరోనా (కొవిడ్-19) వైరస్‌ ప్రభావం ఉన్న నేపథ్యంలో పోప్‌ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకొంది. ఆదివారం ప్రార్థనల సమయంలో ఆయన పలుమార్లు దగ్గుతూ కనిపించారు. ప్రార్థన చివర్లో ఆయన అక్కడ సమావేశమైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘‘జలుబు తీవ్రత ఎక్కువగా ఉన్నందున నేను ఈ సంవత్సరం ప్రార్థనా సమావేశంలో పాల్గొనలేకపోతున్నాను. కానీ, నేను ఎక్కడ ఉంటే అక్కడి నుంచే మీ అందరికోసం ప్రార్థిస్తాను’’ అని తెలిపారు. తీవ్ర జలుబుతో బాధపడుతున్న కారణంగా ఆయన కార్యక్రమాలను రద్దు చేసుకొన్నారు. దీని గురించి వాటికన్‌ సిటీ అధికారిక ప్రకటన చేసింది. పోప్‌ ఫ్రాన్సిస్‌ స్వల్ప అనారోగ్యం బాధపడుతున్నారని తెలపింది. ఇప్పటికే ఇటలీ వ్యాప్తంగా 1,000 మంది పైగా కరోనా బారిన పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని