చైనా వెలుపల కరోనా ఉగ్రరూపం..!
జనీవా: గత కొన్నిరోజులుగా చైనాను వణికిస్తున్న కరోనా వైరస్, ప్రస్తుతం ప్రపంచ దేశాలను కకావికలం చేస్తోంది. చైనాలో విజృంభించినదానికంటే అత్యధిక వేగంతో ప్రస్తుతం కరోనా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. కేవలం గడిచిన 24గంటల్లో చైనాలో కన్నా ఆ దేశం వెలుపల నమోదవుతున్న కేసుల సంఖ్య 8రెట్లు ఎక్కువగా ఉండటం తీవ్ర ఆందోళన చెందాల్సిన విషయమని డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ టెడ్రాస్ అధానోమ్ గెబ్రెయేసస్ పేర్కొన్నారు.
మరణాల సంఖ్య పెరగడంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
జనీవా: గత కొన్నిరోజులుగా చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్(కొవిడ్-19) ప్రస్తుతం ప్రపంచ దేశాలను కకావికలం చేస్తోంది. చైనాలో విజృంభించిన దానికంటే మరింత వేగంగా ప్రస్తుతం కరోనా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. కేవలం గడిచిన 24గంటల్లో చైనాలో కన్నా ఆ దేశం వెలుపల నమోదవుతున్న కేసుల సంఖ్య 8రెట్లు ఎక్కువగా ఉండటం తీవ్ర ఆందోళన చెందాల్సిన విషయమని డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ టెడ్రాస్ అధానోమ్ గెబ్రెయేసస్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత అధికంగా ఉందని, మరణాల సంఖ్య మరింత పెరగడం తీవ్ర ఆందోళనకర విషయమన్నారు. ఇప్పటికే దక్షిణకొరియా, ఇటలీ, ఇరాన్తో పాటు జపాన్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉందన్నారు.
దీంతో పాటు అమెరికాలో కూడా కరోనా ప్రభావంతో ఇప్పటికే ఆరుగురు మరణించగా దాదాపు 91 కేసులు నమోదయ్యాయి. అయితే కరోనానను గుర్తిచేందుకు తమ దగ్గర అన్ని వసతులు ఉన్నాయని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ ఒక్క వారంలోనే దాదాపు పదిలక్షల మందిని పరీక్షించేందుకు కావాల్సిన వనరులు తమ దగ్గర ఉన్నాయని పేర్కొంది. అయితే పరీక్షలు నిర్వహించేకొద్ది కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సీనియన్ అధికారి అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఊహించినదానికంటే ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా భారినపడి 3వేల మందికిపైగా మరణించగా..86వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇటలీలో కూడా ఈ మరణాల సంఖ్య ఏకంగా18నుంచి 52కు చేరింది. ఇరాన్లో దాదాపు 66మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, దక్షిణకొరియాలో 26మంది మరణించారు. ఇప్పటికి చైనా వెలుపల మొత్తం 8700 కేసులు నమోదుకాగా మరణాల సంఖ్య 130 దాటింది.
చైనాలో తగ్గిన తీవ్రత
కరోనాకు కేంద్రంగా భావిస్తున్న వుహాన్ నగరంలో మాత్రం కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య తగ్గిందని అక్కడి అధికారిక మీడియా పేర్కొంది. దీంతో కరోనా చికిత్సకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రుల్లో కొన్నింటిని మూసివేస్తున్నట్లు వెల్లడించింది. వుహాన్ సమీప ప్రాంతమైన హూబేలో కూడా వీటి సంఖ్య తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం