అధినేతతో షేక్హ్యాండా? వద్దు బాబోయ్...
దేశాధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తితో కరచాలనం అంటే ఎవరికైనా గౌరవప్రదమైనదిగా భావిస్తారు. కానీ జర్మనీలో మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా జరిగింది.
జర్మనీ ఛాన్స్లర్కి కరోనా ఎఫెక్ట్
బెర్లిన్: అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తితో కరచాలనం అంటే ఎవరైనా గౌరవప్రదంగా భావిస్తారు. కానీ జర్మనీలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. ఆ దేశ రాజధాని బెర్లిన్లో ఓ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి హాజరుకావడానికి వచ్చిన ఆ దేశ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్.. అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి హోర్స్ట్ సీహోఫర్కు షేక్ హ్యాండ్ ఇవ్వటానికి చేయి చాచారు. కానీ ఆయన షేక్హ్యాండ్ ఇవ్వడానికి తన చేతిని అందించకుండా.. జస్ట్ ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు. ఈ విధమైన ప్రతిచర్యకు ఏంజెలా ముందు ఆశ్చర్యపోయారు. అనంతరం విషయం అర్థం కావటంతో ఇద్దరూ నవ్వుకున్నారు.
జర్మనీలో ఇప్పటి వరకూ 157 కరోనా వైరస్ (కొవిడ్-19) కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇతరులకు షేక్హ్యాండ్ ఇవ్వకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!