అమెరికాలో తొమ్మిదికి చేరిన కొవిడ్ మృతులు
అమెరికాలో కరోనా మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. వీరంతా వాషింగ్టన్ రాష్ట్రానికిచ చెందినవారే. మరోవైపు బాధితుల సంఖ్య 100దాటినట్లు అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.........
వాషింగ్టన్: అమెరికాలో కరోనా మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. వీరంతా వాషింగ్టన్ రాష్ట్రానికిచ చెందినవారే. మరోవైపు బాధితుల సంఖ్య 100దాటినట్లు అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మరోవైపు చైనాలో కొత్తగా వైరస్ బారిన పడ్డవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. మంగళవారం 115 మందికి కొవిడ్ సోకినట్లు గుర్తించారు. మరో 38 మంది మృత్యువాతపడడంతో మృతుల సంఖ్య 2,981కి చేరింది. ఇక దక్షిణ కొరియాలో 142 మంది కొత్తవారికి వైరస్ సంక్రమించినట్లు ధ్రువీకరించారు. దీంతో బాధితుల సంఖ్య 5,528కి తాకింది. మంగళవారం మరో నలుగురు మరణించడంతో మృతుల సంఖ్య 32కు చేరింది. వివిధ దేశాల్లో కొవిడ్ మరణాలు, బాధితుల సంఖ్య ఇలా ఉంది...
దేశం | బాధితుల సంఖ్య | మరణాల సంఖ్య |
చైనా | 80,270 | 2,981 |
దక్షిణ కొరియా | 5328 | 32 |
ఇరాన్ | 2,336 | 77 |
ఇటలీ | 2,263 | 79 |
అమెరికా | 108 | 09 |
జపాన్ | 294 | 06 |
ఫ్రాన్స్ | 204 | 04 |
హాంకాంగ్ | 100 | 02 |
భారత్ | 06 | 00 |
ప్రపంచవ్యాప్తంగా | 92,787 | 3,201 |
* అర్జెంటీనాలో తొలికేసు నమోదైంది. బాధితుడు ఇటీవల ఇటలీ నుంచి వచ్చినట్లు గుర్తించారు.
* హైదరాబాద్లో ఓ వ్యక్తి కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దుబాయ్ నుంచి అతను ఇండిగో విమానంలో ఫిబ్రవరి 20న భారత్కు వచ్చాడు. దీంతో ఆరోజు విధుల్లో ఉన్న సిబ్బందిని ఇంట్లోనే ఉండాలని ఇండిగో సంస్థ ఆదేశించింది.
* భారత నావికాదళం విశాఖపట్నంలో ఈ నెలలో జరగాల్సిన ‘మిలన్-2020’ విన్యాసాలను వాయిదా వేసింది. దీంట్లో దాదాపు 30 దేశాలు పాల్గొనాల్సి ఉంది.
* ఇటు భారత్లోనూ వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్రలో ఆరుగురు అనుమానితుల్ని ప్రభుత్వం వైద్యుల పర్యవేక్షణలో ఉంచింది. ఇప్పటి వరకు 149 మందికి పరీక్షలు జరపగా.. అందరికీ నెగటివ్ అని తేలినట్లు వైద్యులు తెలిపారు. మరో ముగ్గురు నివేదికలు రావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా