అన్ని విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు 

భారత్‌కు వచ్చే అందరు అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు.

Updated : 04 Mar 2020 20:11 IST

దిల్లీ: భారత్‌కు వచ్చే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. గతంలో మాదిరిగా కేవలం పన్నెండు దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులను మాత్రమే కాకుండా ... అందరు అంతర్జాతీయ విమాన ప్రయాణికులు, విమానాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 

ఓ మీడియా సమావేశంలో మంత్రి హర్షవర్ధన్‌ మాట్లాడుతూ... ఇరాన్‌ ప్రభుత్వం సహకరిస్తే ఆ దేశంలో కూడా కరోనా వైద్య పరీక్షల సదుపాయాన్ని నెలకొల్పుతామని అన్నారు. ఇరాన్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి ముందు వారిని సునిశితంగా పరీక్షించేందుకు ఈ చర్య ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వివరించారు. దేశ రాజధానిలోని ఆస్పత్రులలో ఐసోలేషన్‌ వార్డ్‌లను నెలకొల్పే విషయమై దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి, సంబంధిత అధికారులతో చర్చలు జరిపామని హర్షవర్ధన్‌ చెప్పారు. భారత్‌లో 28 మందికి కొవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయిందని మంత్రి చెప్పారు. 

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని