మాస్కులతో పార్లమెంటుకు..!
దిల్లీ: కరోనావైరస్తో దేశం మొత్తం ఇప్పటికే అప్రమత్తం కాగా, ఇటు పార్లమెంటులో కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పార్లమెంట్ సిబ్బంది ఈరోజు మాస్కులు ధరించి విధులకు హాజరయ్యారు. అంతేకాకుండా చేతులకు ప్లాస్టిక్ కవర్లు ధరించి స్కానింగ్ నిర్వహించడం కనిపించింది.
దిల్లీ: కరోనావైరస్(కొవిడ్-19)తో దేశం మొత్తం ఇప్పటికే అప్రమత్తం కాగా, ఇటు పార్లమెంటులో కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పార్లమెంట్ సిబ్బంది ఈ రోజు మాస్కులు ధరించి విధులకు హాజరయ్యారు. అంతేకాకుండా చేతులకు ప్లాస్టిక్ కవర్లు ధరించి స్కానింగ్ నిర్వహించడం కనిపించింది.
కరోనా దరిచేరకుండా ఉండాలంటే ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ష్యేక్ హ్యాండ్ వద్దు, నమస్తే ముద్దు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలోనే పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది. ఈ రోజు పార్లమెంటుకు హాజరైన కొందరు కాంగ్రెస్ సభ్యులు కరచాలనం చేసుకున్నారు. అనంతరం వారు శానిటైజర్తో తమ చేతులను శుభ్రం చేసుకున్నట్లు సమాచారం.
ఇక మరికొందరు పార్లమెంట్ సభ్యులు మాస్కులు ధరించి సభకు హాజరయ్యారు. మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ రాణా మాస్కు ధరించి లోక్సభకు హాజరవడం అందర్నీ ఆకర్షించింది. లద్దాక్ ఎంపీ జమ్యాంగ్ తెసెరింగ్ నాంగ్యల్ కూడా మాస్కుతో పార్లమెంట్కు వచ్చారు. ఇక రాజ్యసభ సభ్యులు సుశీల్ కుమార్ గుప్త కూడా మాస్కుతో సభకు హాజరుకావడం విశేషం. ముందస్తు చర్యల్లో భాగంగా పార్లమెంట్ ఆవరణలో థర్మల్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేయాలని చైర్మన్ను కోరినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం