‘ఒక్కొక్కరూ ఆరుగుర్ని కనండి’
ప్రతి మహిళా ఆరుగురికి జన్మనివ్వాలని వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ ముదురో విజ్ఞప్తి చేశారు. దేశం బాగు కోసం పిల్లల్ని కనాలని సూచించారు. దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న....
కారాకస్ (వెనుజువెలా): దేశంలోని ప్రతి వివాహిత మహిళ ఆరుగురికి జన్మనివ్వాలని వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో విజ్ఞప్తి చేశారు. దేశం బాగు కోసం పిల్లల్ని కనాలని సూచించారు. దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్షుడు ఇలా పిలుపునివ్వడంపై ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు.
జాతీయ మహిళా ఆరోగ్య కార్యక్రమంపై ఓ టీవీ కార్యక్రమంలో మదురో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ప్రతి ఒక్క మహిళా ఆరుగురేసి బిడ్డలకు జన్మనివ్వాలని కోరారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వ్యాఖ్యలపై ఆయన మద్దతుదారులు సైతం అసహనం వ్యక్తంచేశారు. ‘దేశంలో ఆస్పత్రులు పనిచేయడం లేదు. వ్యాక్సిన్లు దొరకడం లేదు. పౌష్టికాహార లోపంతో పిల్లలకు చనుబాలు కూడా ఇవ్వలేని స్థితిలో తల్లులు ఉన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో మదురో పాలన చూస్తుంటే ఆయన మానసిక స్థితి సరిగా లేనట్లు ఉంది’’ అని జాతీయ అసెంబ్లీ సభ్యుడు మనుయెలా బొలివర్ ట్వీట్ చేశారు. దేశంలో పుట్టిన చిన్నారులకే బతుకుతారో లేదో తెలియని పరిస్థితుల్లో ఇలా పిలుపునివ్వడం బాధ్యతారాహిత్యమని మానవహక్కుల కార్యకర్త ఒకరు మండిపడ్డారు.
కొన్నేళ్లుగా వెనుజువెలా ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 2015 నుంచి ఇప్పటి వరకు 45 లక్షల మంది వెనుజువెలా పౌరులు ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. 93 లక్షల మంది పౌరులు తమ కనీస అవసరాలకు నోచుకోవడం లేదని లెక్కలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.