17రెట్ల వేగంతో కరోనా విజృంభన..!
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ చైనాకు వెలుపల 17రోట్ల వేగంతో వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో దీని వ్యాప్తిని అరికట్టాలని ప్రపంచదేశాలకు సూచించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 330మంది ప్రాణాలు కోల్పోగా 98వేల మందికి ఇది వ్యాపించింది.
జెనీవా: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ చైనాకు వెలుపల 17రెట్ల వేగంతో వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అరికట్టాలని ప్రపంచదేశాలకు సూచించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3300మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 98వేల మంది దీని బారినపడ్డారు. కేవలం చైనాలోనే 3042మంది చనిపోగా తాజాగా మరో 30మరణాలు సంభవించాయి.
తక్కువ ఉష్ణోగ్రతలతో భయంలేదు: ఐసీఎమ్ఆర్
భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 31కి చేరింది. ఈ సమయంలోనే దేశంలో కొన్నిప్రాంతాల్లో వాతావరణం చల్లబడడంతో కరోనా వైరస్ మరింత విజృంభిస్తుందనే ఆందోళన ప్రజల్లో ఎక్కువైంది. అయితే ఇలాంటి వాతావరణ మార్పులకు, కరోనా వ్యాప్తి విజృంభనకు సంబంధంలేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్ఆర్) వెల్లడించింది. వాతావరణంలోని మార్పులు కరోనా వైరస్ని ప్రభావితం చేయవని తెలిపింది. తక్కువ ఉష్ణోగ్రతల్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి ఆధారం లేదని ఐసీఎమ్ఆర్ డైరక్టర్ జనరల్ బలరాం బార్గవ స్పష్టం చేశారు. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందదని, వైరస్ సోకిన వారితో అత్యంత సన్నిహితంగా మెలగడం వల్ల మాత్రమే ఇది వ్యాపిస్తుందని పేర్కొన్నారు. దిల్లీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడడంతో ప్రజల్లో దీనిపై అనుమానాలు ఎక్కువైన నేపథ్యంలో ఐసీఎమ్ఆర్ తాజా ప్రకటన చేసింది.
ఐక్యరాజ్యసమితి ఉద్యోగికి కరోనా:
యూఎన్: ప్రపంచంలో దాదాపు 85దేశాల్లో విజృంభిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం తాజాగా ఐక్యరాజ్యసమితికి తాకింది. ఐక్యరాజ్యసమితిలో పనిచేస్తున్న బ్రిటన్కు చెందిన 33ఏళ్ల మహిళా ఉద్యోగికి కరోనా వైరస్ నిర్ధారణ అయినట్లు యూఎన్ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి ఉద్యోగుల్లో ఇదే మొదటి కేసు అని, అయినప్పటికీ అన్ని విభాగాలను అప్రమత్తం చేసి అత్యవసర నియామాలను పాటిస్తున్నామని పేర్కొంది. ప్రస్తుతం వైరస్ సోకిన వ్యక్తి ఆసుపత్రిలో ఉన్నట్లు, ఆమెతో పాటు సన్నిహితంగా ఉన్నవారిని కూడా పరిశీలనతో ఉంచినట్లు తెలిపింది.
830 కోట్ల డాలర్లు కేటాయించిన అమెరికా
వాషింగ్టన్: అమెరికాలో పెరుగుతున్న కరోనా కేసులతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అమెరికాలో కరోనాతో 12మంది మరణించగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే, కరోనాను ఎదుర్కొనేందుకు 830కోట్ల డాలర్ల ప్రత్యేక నిధిని కేటాయిస్తూ అమెరికా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుకు ఇరుపక్షాల మద్దతుతో సెనేట్ ఆమోదం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)