గత ఐదేళ్లలో మేం ఓడింది దీంట్లోనే..: గడ్కరీ
గత ఐదు నెలల్లో తమ ప్రభుత్వం విఫలమైన అంశాన్ని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్ని తగ్గించడంలో తన శాఖ తీవ్రంగా విఫలమైందని పేర్కొన్నారు.......
ముంబయి: గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం విఫలమైన అంశాన్ని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్ని తగ్గించడంలో తన శాఖ తీవ్రంగా విఫలమైందని పేర్కొన్నారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2018 రోడ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉండడం విచారకరమన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో జరుగుతున్న ప్రమాదాల్లో 11 శాతం భారత్లోనే జరుగుతున్నాయని తెలిపారు. ఈ అంశంలో భారత్ చాలా దయనీయ స్థితిలో ఉందన్నారు. ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వీటిలో 1.5లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల మన దేశ జీడీపీలో రెండు శాతం నష్టపోతున్నామన్నారు. 2018 నివేదిక ప్రకారం ప్రతి గంటకి 53 ప్రమాదాలు సంభవిస్తుండగా.. 17 మంది మృత్యువాతపడుతున్నారని వెల్లడించారు.
జాతీయ రహదారుల సంఖ్యని పెంచాల్సిన అవసరాన్ని కూడా ఈ సందర్భంగా గడ్కరీ నొక్కిచెప్పారు. దేశంలో 52లక్షల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయని.. వీటిలో కేవలం 96వేల కి.మీ మాత్రమే జాతీయ రహదారులన్నారు. 40శాతం ట్రాఫిక్ కేవలం రెండు శాతం రోడ్లపై తిరుగుతోందని వెల్లడించారు. జాతీయ రహదారులను రెండు లక్షల కిలోమీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వచ్చే ఐదేళ్లలో 80శాతం ట్రాఫిక్ రహదారులపైనే ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
దేశ రోడ్ నెటవర్క్లో 1.94శాతంగా ఉన్న జాతీయ రహదారులపై 30.2శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని గడ్కరీ వెల్లడించారు. రాష్ట్రాల పరిధిలో ఉండే రహదారులపై 25.2శాతం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లోని రోడ్లపై 40శాతం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. 18-60 మధ్య వయస్సులో ఉన్నవారే ఈ ప్రమాదాల్లో ఎక్కువగా చనిపోతున్నారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.