పీఓకేను అజాద్‌ కశ్మీర్‌ అంటూ..

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పదోతరగతి ప్రశ్నాపత్రాల్లోని ఒక ప్రశ్న కాంగ్రెస్‌, భాజపాల మధ్య అగ్గిని రాజేసాయి. శనివారం జరిగిన పదోతరగతి సోషల్‌ పరీక్ష

Published : 08 Mar 2020 01:06 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పదోతరగతి ప్రశ్నాపత్రాల్లోని ఒక ప్రశ్న కాంగ్రెస్‌, భాజపాల మధ్య అగ్గిని రాజేశాయి. శనివారం జరిగిన పదోతరగతి సోషల్‌ పరీక్ష ప్రశ్నాపత్రంలో అజాదీ కశ్మీర్‌ను(పాక్‌అక్రమితకశ్మీర్‌) మ్యాపులో గుర్తించండంటూ,  ఒక సమాధానంగా ‘‘ఆజాద్‌ కశ్మీర్‌’’ అంటూ ఇచ్చింది. దానిని భాజపా అధికారప్రతినిధి రజనీష్‌ అగర్వాల్‌ ఫోటో తీసి సామాజికమాధ్యమాలలో షేర్‌ చేశాడు. ఈ విషయంపై భాజపానాయకులు అధికార కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రశ్నాపత్రంలో ఆ విధంగా రావడంపై సీఎం కమల్‌నాధ్‌ అగ్రహం వ్యక్తంచేస్తూ బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. దీనికి బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేసి, ప్రశ్నాపత్రంలో నుంచి ఆ రెండు ప్రశ్నలను కూడా తొలగించినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రజనీష్‌ మాట్లాడుతూ కశ్మీర్‌ ప్రాంతం సువిశాల భారతదేశంలో అంతర్భాగమన్నారు. కాంగ్రెస్‌ నేతల నిజస్వభావం బయటపడిందని, పాకిస్థాన్‌వారు పీఓకే ప్రాంతాన్ని అజాదీకశ్మీర్‌ అంటుంటారు. వారిలాగే వేర్పాటువాదంతో కాంగ్రెస్‌వాళ్లు ప్రశ్నాపత్రంలో కావాలనే ఇలాంటి ప్రశ్నలు అడిగారని దుయ్యబట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని