ప్రధాని ప్రశంసించిన మహిళలు..ఎందరికో స్ఫూర్తి
ఒకరు అనాదల ఆకలి తీరిస్తే, మరొకరు సంప్రదాయ కళల కోసం కృషి చేశారు, ఇంకొకరు జీవితంలో గాయపడినా కుంగిపోకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఇలా ఒక్కో మహిళది ఒక్కో స్ఫూర్తి వంతమైన కథ.
దిల్లీ: ఒకరు అనాధల ఆకలి తీరిస్తే, మరొకరు సంప్రదాయ కళల కోసం కృషి చేశారు, ఇంకొకరు జీవితంలో గాయపడినా కుంగిపోకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఇలా ఒక్కో మహిళది ఒక్కో స్ఫూర్తి వంతమైన కథ. ఎంతో మందికి వారి జీవితాలు స్ఫూర్తినిస్తాయనేందుకు ఉదాహరణ. వారే నేడు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ఖాతా ఉపయోగించిన మహిళలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ తన ఖాతాను స్ఫూర్తివంతమైన మహిళలకు అప్పజెప్పనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. అలా చెప్పినట్లు వారికి అప్పగించారు. ఆయా మహిళలు #sheinspireus ట్యాగ్తో తమ జీవితాల గురించి ట్వీట్ల ద్వారా వెల్లడించి.. ఇతరులకు స్ఫూర్తి పంచుతున్నారు. వారు ట్వీట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకలి తీర్చిన స్నేహ
స్నేహ మోహన్దాస్ చెన్నైకి చెందిన మహిళ. ఆమె ఆకలితో అలమటించే అనాథలైన వారికి ఫుడ్ బ్యాంక్ ఎన్జీవో సంస్థ స్థాపించి భోజనం ప్యాకెట్లు అందిస్తూ ఆదుకుంటున్నారు. ఈ సందర్భంగా అనాథల ఆకలి తీర్చేందుకు ఆమె చేస్తున్న కృషిని మోదీ ట్విటర్లో వివరించారు. ‘నాకు నచ్చింది చేయడంలో నేను స్ఫూర్తి పొందుతాను. మోదీ ఖాతా ద్వారా ఈ రోజు అందరిలో స్ఫూర్తి నింపాలనుకుంటున్నాను. మాస్ కుకింగ్, కుకింగ్ మారథాన్స్, బ్రెస్ట్ ఫీడింగ్, అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నాం. మాతో చేతులు కలపాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కనీసం ఒక్కరికైనా సాయం చేయండి. ఆకలి లేని సమాజ నిర్మాణంలో భాగం కండి’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
పేలుళ్ల నుంచి బయటపడిన మాళవిక
మోదీ మెచ్చిన మహిళల్లో మాళవికా అయ్యర్ ఒకరు. ఆమె కూడా తన జీవితం గురించి మోదీ ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు. మాళవిక రాష్ట్రపతి అవార్డు గ్రహీత. ఈ సందర్భంగా ఆమె తన 13వ ఏట జరిగిన బాంబు పేలుళ్ల నుంచి ఎలా బయటపడిన విధానం, ఆ తర్వాత కుటుంబ సభ్యుల మద్దతుతో పీహెచ్డీ పూర్తి చేసిన విధానాన్ని గురించి వివరించారు. ‘నేను నా 13వ ఏట ఉన్నప్పుడు భయంకరమైన బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత నేను కుటుంబ ప్రోత్సాహంతో పనిచేసి పీహెచ్డీ సాధించాను’ అని పేర్కొన్నారు. ‘అంగీకారం అనేది మనకు మనమిచ్చుకునే గొప్ప బహుమతి. మన జీవితంపై మనకు నియంత్రణ లేకపోవచ్చు. కానీ జీవిత వైఖరి పట్ల నియంత్రణ కలిగి ఉండాలి. కానీ చివరిలో మన సవాళ్లను ఎలా తట్టుకోగలుగుతామనేదే విషయం’అని మరో ట్వీట్లో పేర్కొన్నారు.
సంప్రదాయ కళల అరీఫా
మోదీ మెచ్చిన వనితల్లో మరో మహిళ కశ్మీర్కు చెందిన వ్యాపారవేత్త అరీఫా. సంప్రదాయ కళల కోసం తాను చేసిన కృషిని ఆమె ట్విటర్లో వివరించారు. ‘కశ్మీరీ సంప్రదాయ కళల కోసమే నేను ఎప్పుడూ కలలు కన్నాను. ఎందుకంటే ఇక్కడి స్థానిక మహిళల సాధికారతకు ఆ కళలు ఎంతగానో తోడ్పడుతాయి. నేను మహిళా కళాకారుల పరిస్థితిని చూశాను. అందుకే వారి పరిస్థితిని బాగుచేసేందుకు నేను ముందడుగు వేశాను’ అని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. సంప్రదాయానికి, ఆధునికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు.
నీరే భవిష్యత్తుగా కల్పనా
హైదరాబాద్కు చెందిన కల్పనా వృత్తి పరంగా ఆర్కిటెక్ట్. భవిష్యత్తు తరాల కోసం సురక్షితమైన నీరు ఎలా అందించాలనే విషయమై తాను చేసిన కృషిని ఆమె వివరించారు. ‘మనం చేసే చిన్న పనులు పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. నీరు మనకు లభించిన విలువైన వారసత్వం. కాబట్టి తర్వాతి తరాలను నీటి నుంచి దూరం చేయకూడదు. నీటిని బాధ్యత ఉపయోగించుకోవాలి. వర్షం నీటిని నిల్వ చేయాలి, చెరువుల్ని రక్షించాలి, ఉపయోగించిన నీటిని మళ్లీ రీసైకిల్ చేయాలి.. ఇలా నీటిపై నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమాలపై’ ఆమె ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.
బంజార కళల కృషిలో ‘విజయం’
విజయా పవార్ మహారాష్ట్రలోని బంజార కమ్యూనిటీకి చెందిన మహిళ. తమ ప్రాంత హస్త కళల గురించి తాను చేసిన కృషిని, అందుకోసం ఆమెకు మహిళల నుంచి అందిన సహకారం గురించి వివరించారు. ‘మీరు దేశంలోని విభిన్న ప్రాంతాల్లో ఉన్న వివిధ రకాల హస్త కళల గురించి విని ఉంటారు. మహారాష్ట్రలోని బంజార కమ్యూనిటీకి చెందిన హస్తకళల గురించి నేను చూపిస్తాను. నేను గత రెండు దశాబ్దాలుగా ఈ కళలపై కృషి చేస్తున్నాను. ఇందుకోసం నాకు వేలాది మంది మహిళలు సహాయం చేస్తున్నారు’ అని ట్వీట్లో రాసుకొచ్చారు.
పరిశుభ్రతకు కళావతి కృషి
కళావతి యూపీలోని కాన్పూర్కు చెందిన వనిత. ఈమె తన చుట్టుపక్కల ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన లేకుండా చేసేందుకు ఫండ్స్ జమ చేసిన కృషిని ట్విటర్లో వివరించారు. ‘నేను నివసించే ప్రదేశంలో అపరిశుభ్ర వాతావరణం ఉంది. దీన్ని తొలగించేందుకు నిర్ణయించుకున్నా. అందులో భాగంగా మరుగుదొడ్లు నిర్మాణానికి కృషి చేశా. సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లలనుకునే హృదయ పూర్వక ప్రయత్నాలు ఎప్పటికీ విఫలం కావు. కాబట్టి మీ లక్ష్యాన్ని సాధించాలనుకుంటే వెనక్కి తిరిగి చూడకండి’ అని ట్వీట్ ద్వారా వెల్లడించారు.
సంకల్పంతోనే ‘వీణా’ విజయం
ప్రధాని మెచ్చిన వారిలో చివరి మహిళ బిహార్కు చెందిన వీణాదేవి ఒకరు. సమాజంలో గౌరవం సంపాదించడానికి తాను చేసిన కృషిని ఆమె వివరించారు. ఆ గౌరవమే తనకు ముంగేర్ గ్రామ సర్పంచి పదవి వచ్చేలా చేసిందని వివరించారు. ‘సంకల్పం ఉన్న చోట విజయం సిద్ధిస్తుంది. చిన్న ప్రదేశంలో పుట్టగొడుగులు పండించడం ద్వారా నాకు గుర్తింపు రావడం ప్రారంభమైంది. ఈ వ్యవసాయం నాకు స్వయం సమృద్ధిని నేర్పించింది. అంతేకాకుండా నాలో ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంపొందించి కొత్త జీవితాన్ని ఇచ్చింది’ అని మోదీ ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్