దేశంలో 43కు చేరిన కరోనా కేసులు

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్‌(కొవిడ్‌-19) కేసులు భారత్‌లో అంతకంతకూ పెరుగుతున్నాయి. సోమవారం మరో నలుగురికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో కరోనా బారిన పడ్డవారి సంఖ్య 43కు

Published : 09 Mar 2020 15:22 IST

భారత ప్రయాణికులపై ఖతార్‌ నిషేధం

దిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్‌(కొవిడ్‌-19) కేసులు భారత్‌లో అంతకంతకూ పెరుగుతున్నాయి. సోమవారం మరో నలుగురికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో కరోనా బారిన పడ్డవారి సంఖ్య 43కు పెరిగింది. కేరళలో మూడేళ్ల చిన్నారి సహా జమ్ముకశ్మీర్‌లో ఓ మహిళ, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు, దిల్లీలో ఒకరికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. గత మంగళవారం నాటికి దేశంలో కేవలం 6 కరోనా కేసులు నమోదవ్వగా.. వారంలోపే ఈ సంఖ్య 43కు చేరడం గమనార్హం. వీరిలో 16 మంది ఇటలీ దేశస్థులున్నారు. 

కశ్మీర్‌కు జైశంకర్‌

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ నేడు కశ్మీర్‌లో ఆకస్మికంగా పర్యటించారు. కరోనా భయంతో ఇరాన్‌లో చిక్కుకుపోయిన 300 మంది కశ్మీరీ విద్యార్థులతో తల్లిదండ్రులతో మాట్లాడారు. త్వరలోనే వారిని స్వదేశానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 

విదేశీయుల రాకపై ఖతార్‌ నిషేధం

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఖతార్‌ ప్రభుత్వం విదేశీయులపై ఆంక్షలు తీసుకొచ్చింది. భారత్‌ సహా 14దేశాల ప్రయాణికులపై తాత్కాలికంగా నిషేధం విధించింది. చైనా, భారత్‌, ఈజిప్టు, ఇరాన్‌, ఇరాక్‌, లెబనాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, దక్షిణకొరియా, శ్రీలంక, సిరియా, థాయ్‌లాండ్‌ దేశాలపై ఈ నిషేధం వర్తించనుంది.  

ఇవీ చదవండి..

కేరళలో మూడేళ్ల చిన్నారికి కరోనా

కరోనా ఎఫెక్ట్‌: ఉల్లంఘిస్తే మూడు నెలలు జైలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని