డబ్బులివిగో.. ‘కరోనా’తో జర జాగ్రత్త!
చైనాలో విజృంభించిన ప్రాణాంతక మహమ్మారి కరోనా యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని ధాటికి దేశాల మధ్య వాణిజ్యం స్తంభించడంతో పాటు విద్య, ఉద్యోగ రంగాలపై దెబ్బ పడింది. ఈ వైరస్ ........
ఒక్కో ఉద్యోగికి రూ.21 వేలిచ్చిన జపాన్ కంపెనీ
ఇంటర్నెట్ డెస్క్: చైనాలో విజృంభించిన ప్రాణాంతక మహమ్మారి కరోనా (కొవిడ్ 19) యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని ధాటికి దేశాల మధ్య వాణిజ్యం స్తంభించడంతో పాటు విద్య, ఉద్యోగ రంగాలపై దెబ్బ పడింది. ఈ వైరస్ కోరలు చాస్తున్న వేళ జపాన్ అప్రమత్తమైంది. ఉద్యోగులు ఒకేచోట గుమిగూడకుండా నిరోధించేందుకు ఆ దేశంలోని అనేక కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం అనేక కార్యక్రమాలను రద్దుచేసుకుంటున్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ తద్వారా కొవిడ్ నియంత్రణకు అడ్డుకట్టవేసేలా కృషిచేస్తున్నాయి. తాజాగా, జపాన్లోని ఓ కంపెనీ అయితే, మరో అడుగు ముందుకేసి వైరస్ నుంచి ఉద్యోగుల సంరక్షణకు మరింత ప్రాధాన్యమిచ్చేలా మాస్క్లు, శానిటైజర్ల కోసం ఒక్కొక్కరికి 30వేల యెన్లు (దాదాపు రూ.21వేలు) చొప్పున పంపింది. దీంతో పాటు ఓ లేఖను కూడా జత చేసింది. ఈ కష్ట సమయంలో ఉద్యోగులు చేస్తున్న శ్రమను లేఖలో అభినందించింది. ఫేస్ మాస్క్లు, శానిటైజర్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో ఉద్యోగులు ఈ మొత్తాన్ని వాటి కొనుగోలుకు వినియోగించాలని సూచించింది. జపాన్లో ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 488 కేసులు నమోదయ్యాయి.
దాదాపు 80కి పైగా దేశాలకు కరోనా వ్యాపించింది. ఇప్పటిదాకా కరోనా బారినపడి ప్రపంచ వ్యాప్తంగా 3816 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,09,271 మంది కరోనా సోకడంతో చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా 3119 మంది చైనాలోనే ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాత ఇటలీలో 366 మంది మృతి చెందారు. భారత్లో ఇప్పటివరకు 43 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
14 దేశాల ప్రజల రాకపై ఖతర్ తాత్కాలిక నిషేధం
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ సహా మరో 13 దేశాల పర్యాటకుల ప్రవేశంపై ఖతర్ తాత్కాలిక నిషేధం విధించింది. భారత్, బంగ్లాదేశ్, చైనా, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, లెబనాన్, నేపాల్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, శ్రీలంక, సిరియా, థాయిలాండ్ నుంచి వచ్చే పర్యాటకులు తమ దేశంలోకి రాకపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో ఖతర్ ప్రభుత్వం స్పష్టంచేసింది.
ఇటలీలో 16మిలియన్ల మందిపై ఆంక్షలు
ఇటలీలో దాదాపు మూడోవంతు మంది ప్రజలపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజల్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సి వస్తోందని ఇటలీ ప్రధాని జిస్సెప్పే కాంటీ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వుపై ఆయన నిన్న సంతకం చేశారు. ఒకరోజు వ్యవధిలో 1492 కొత్త కేసులు వెలుగు చూడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంక్షల కారణంగా ఒక ప్రదేశం నుంచి మరో చోటుకు వెళ్లడానికి ప్రజలకు అవకాశం ఉండదు. బహిరంగ వేడుకలు నిర్వహించుకునే వీలుండదు. ఇటలీలో ఇప్పటివరకు 366 మంది మృత్యువాత పడ్డారు. 7375 కేసులు నమోదయ్యాయి. చైనా, దక్షిణ కొరియా తర్వాత అత్యధిక కేసులు ఇక్కడే నమోదు కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. -
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
వచ్చే ఏడాదిలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేసింది. UPSC 2025 Calendar -
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా