కరోనాను ఎలా ఎదుర్కొన్నానంటే...
ఈమె ధైర్యం కోల్పోకుండా కరోనా వైరస్తో వ్యవహరించిన, గెలిచిన తీరు పలువురికి ఆదర్శనీయంగా నిలుస్తోంది.
కరోనా నుంచి కోలుకున్న మహిళ అనుభవం
సియాటెల్: ప్రపంచం మొత్తం కరోనావైరస్ (కొవిడ్-1) భయంతో కకావికలమవుతోంది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మహమ్మారిగా ప్రకటించింది. అయితే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఓ 37 ఏళ్ల అమెరికన్ మహిళ, కరోనా భయంతో వణికిపోతున్న వారికి ఊరట కలిగించేందుకు తన అనుభవాలను వివరించారు.
ఇలా మొదలైంది...
బయోఇంజినీరింగ్లో పీహెచ్డీ చేస్తున్న ఎలిజబెత్ ష్నెయిడర్, వాషింగ్టన్ రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన సియాటెల్కు చెందినవారు. అమెరికాలో అతి ఎక్కువ కరోనా మరణాలు ఈ నగరంలోనే నమోదు కావటం గమనార్హం. ఓ పార్టీలో పాల్గొన్న ఎలిజబెత్కు మూడు రోజుల అనంతరం ఫిబ్రవరి 25న ఫ్లూ మాదిరి లక్షణాలు కనిపించటం మొదలయ్యాయి. ఆ మధ్యాహ్నానికల్లా తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు రావటంతో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న ఆమె ఇంటికి వెళ్లారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆమెకు జ్వరం మరింత తీవ్రమై 103 డిగ్రీలకు చేరుకుంది. ఫ్లూ అన్న అనుమానంతో ఆమె ఔషధాలు తీసుకుంది. కానీ ఆమె జ్వరం తగ్గుముఖం పట్టలేదు. అంతే కాకుండా ఆమెలాగే ఆ పార్టీలో పాల్గొన్న 40 శాతం మందికి కూడా అవే లక్షణాలు బహిర్గతమయ్యాయి.
నేను ఆశ్చర్యపోయా... అమ్మ ఏడ్చింది
ఈ లోగా వాషింగ్టన్ లో మొదటి కరోనా కేసు నమోదు కావటం గురించి ఆమెకు తెలిసింది. అయితే దగ్గు, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది వంటి సమస్యలు లేకపోవటంతో తనకు కరోనా వైరస్ సోకలేదని ఎలిజబెత్ భావించారు. ఈ నేపథ్యంలో ఫ్లూ జ్వరంపై పరిశోధన చేసే ‘సియాటిల్ ఫ్లూ స్టడీ’ అనే సంస్థ పరిశోదనలో పాలు పంచుకోవాలని ఎలిజబెత్ నిర్ణయించుకున్నారు. తద్వారా తన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కూడా ఆమె భావించారు. ఆ సంస్థ వారు పంపిన ఓ శ్వాస పరీక్షా కిట్లో ఎలిజబెత్ తన వివరాలు, నమూనాలు నమోదు చేసి వారికి తిరిగి పంపారు. చివరకు మార్చి 7న పరిశోధనా సంస్థ వారు తనకు కొవిడ్-19 ఉన్నట్టు ఫోన్ ద్వారా తెలియచేశారు. దీనితో ఆమె ఆశ్చర్యపోగా, ఆమె తల్లి మాత్రం తీవ్రంగా వేదనకు గురయ్యారు.
చాలా మంది చేసే పొరపాటు...
అనంతరం ఆమెను కనీసం ఏడు రోజులు ఇంటికే పరిమితమై ఉండాలని వైద్యాధికారులు సూచించారు. ప్రస్తుతం కరోనా వైరస్ పూర్తిగా నయమైన 72 గంటల అనంతరం మాత్రమే ఎలిజబెత్ బయటకు రావటం మొదలు పెట్టారు. ‘‘భయపడ వద్దు... కొవిడ్-19 ఉన్న ప్రతి ఒక్కరూ ఆస్పత్రి పాలు కానవసరంలేదు. ఏ ప్రభుత్వం ప్రజలందరినీ కరోనా అనుమానంతో అనవసరంగా బంధించదు. నా మటుకు నాకు కరోనా దానంతట అదే తగ్గిపోయింది. అయితే చాలా మంది చేసే పొరపాటు నిర్ధారణ పరీక్షలు చేయించుకోకపోవటం. దాని వల్ల మరింత మందికి ఈ వ్యాధి వ్యాప్తించేలా చేయటం. మనకు వ్యాధి ఉందని తెలిసినపుడు మరింత అప్రమత్తతతో మనంతట మనమే ఇంటికి పరిమితమై ఉండాలి. నేను చెప్పేది ఒక్కటే... ఆందోళన పడవద్దు...మీకు కరోనా ఉంది అంటే... ఉండనీయండి. దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోండి. వైద్యులు సూచించిన ఔషధాలు తీసుకోండి. మీ ఆరోగ్య చిహ్నాలు మరీ ప్రమాదకరంగా ఉంటే తప్ప మీరు ఇంటివద్దనే ఉండవచ్చు. చాలా ఎక్కువ మంచినీరు తాగండి. పూర్తి విశ్రాంతి తీసుకోండి. చక్కగా మీకిష్టమైన టీవీ కార్యక్రమాలను చూడండి...’’ అని ఎలిజబెత్ ష్నెయిడర్ నవ్వుతూ సలహా ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే