ఎన్పీఆర్కు ఏ పత్రమూ ఇవ్వక్కర్లేదు: షా
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పార్లమెంట్లో పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత దీనిపై విద్వేష ప్రసంగాలు ప్రారంభమయ్యాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సీఏఏతో పౌరసత్వం పోతుందని........
సమాచారం ఇవ్వడం.. ఇవ్వకపోవడం ఐచ్ఛికమే
దిల్లీ అల్లర్లపై రాజ్యసభలో అమిత్ షా సమాధానం
దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పార్లమెంట్లో పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత దీనిపై విద్వేష ప్రసంగాలు ప్రారంభమయ్యాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సీఏఏతో పౌరసత్వం పోతుందని కొందరు అపోహలు సృష్టించి ముస్లింలను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. ఎన్పీఆర్కు ఎలాంటి పత్రమూ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. నిర్దిష్టమైన సమాచారం ఇవ్వకూడదని ఎవరైనా అనుకుంటే వారిని ఏ ప్రశ్నలూ అడగరని చెప్పారు. సమాచారం ఇవ్వడం, ఇవ్వకపోవడం ఐచ్ఛికమేనన్నారు. ఎన్పీఆర్పై ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని చెప్పారు. ఈ అప్డేషన్ ప్రక్రియలో ఎవరినీ సందేహాస్పదంగా గుర్తించరని స్పష్టంచేశారు. ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లపై ఆయన గురువారం సాయంత్రం రాజ్యసభలో సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దిల్లీ అల్లర్ల వెనుక నిందితులు ఏ మతం, కులం, రాజకీయ పార్టీకి చెందిన వారైనా వదిలేదని లేదని మరోసారి హెచ్చరించారు. అల్లర్లకు కారణమైన నిందితులను గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి ఆధారాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. చట్టం అంటే అల్లరిమూకల్లో వణుకు పుట్టేలా భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడాలంటేనే భయపడేలా శిక్షలు ఉంటాయన్నారు. 36 గంటల్లోనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారనీ.. వారిని నిందించడం సరికాదని విపక్షాలకు సూచించారు.
ఆధార్ సమాచారం వాడట్లేదు
ఈ అల్లర్లలో పోలీస్ కానిస్టేబుల్, ఐబీ ఉద్యోగి హత్య వెనుక నిందితులను అరెస్టు చేసినట్టు హోంమంత్రి వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతుందన్న ఆయన ఈ కేసులో నిందితులను ఫొటో, వీడియో, ఆడియో ఆధారాలతో అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే వ్యవహరిస్తున్నామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డుల ఆధారంగానే నిందితులను గుర్తిస్తున్నాం తప్ప, ఆధార్ సమాచారాన్ని ఇందుకోసం వాడటంలేదన్నారు. దీనిపై కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.
అల్లర్లు ప్రేరేపించడం మా స్వభావం కాదు
దిల్లీ అల్లర్లపై చర్చ నుంచి తామేనాడూ పారిపోలేదన్న అమిత్ షా హోలీ ప్రశాంతంగా జరగాలన్న ఉద్దేశంతోనే ఆలస్యం చేశామని వివరించారు. ఈ రోజు ఉదయం వరకు ఫేస్ రికగ్నేషన్ సాఫ్ట్వేర్ ద్వారా 1922 మంది ముఖాలను గుర్తించినట్టు చెప్పారు. వారిలో 336 మంది యూపీ నుంచి వచ్చినవారు ఉన్నారన్నారు. ఇప్పటివరకు 700 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారని అమిత్ షా స్పష్టంచేశారు. ఈ అల్లర్ల తర్వాత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ప్రజలే వీడియో ఫుటేజీలను పంపారని.. అల్లరి మూకలను గుర్తించేందుకు సహకరించారని తెలిపారు. ఇప్పటివరకు 2600 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఫిబ్రవరి 25న జరిగిన అఖిలపక్ష సమావేశంలో దిల్లీ అల్లర్లను నియంత్రించేందుకు ఎవరూ మిలటరీని పిలవాలని సూచించలేదన్నారు. ఆ సాయంత్రంతో దిల్లీ అల్లర్లు సద్దుమణిగాయన్నారు. అల్లర్లను ప్రేరేపించడం తమ స్వభావం కాదన్న అమిత్ షా వాటిని నివారించడమే తమ స్వభావవమని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM