70 శాతం కొత్త కేసులు ఐరోపాలోనే..!
తొలుత వెలుగులోకి వచ్చిన చైనాలో కరోనా వైరస్(కొవిడ్-19) భారీగా తగ్గుముఖం పట్టింది. గురువారం కొత్తగా కేవలం ఎనిమిది కేసుల మాత్రమే నమోదయ్యాయి. ...
ఇంటర్నెట్ డెస్క్: తొలుత వెలుగులోకి వచ్చిన చైనాలో కరోనా వైరస్(కొవిడ్-19) భారీగా తగ్గుముఖం పట్టింది. గురువారం కొత్తగా కేవలం ఎనిమిది కేసుల మాత్రమే నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 80,813కు చేరింది. ఇక మరో ఏడు మంది మృతిచెందడంతో మరణాల సంఖ్య 3,176ను తాకింది. వైరస్ వ్యాప్తి భారీగా తగ్గుముఖం పట్టడంతో వుహాన్లో ప్రయాణాలపై ఉన్న ఆంక్షల్ని కాస్త సడలించారు. మరోవైపు దక్షిణకొరియాలో కొత్తగా వైరస్ సోకిన వారికంటే కోలుకొని ఇళ్లకు చేరుతున్న వారి సంఖ్య పెరిగడం విశేషం. గురువారం కొత్తగా 110 మంది వైరస్ బారిన పడగా.. మరో 177 మంది కోలుకొని ఆస్పత్రిని వీడారు. ఆ దేశంలో బాధితుల సంఖ్య 7,979కి, మృతుల సంఖ్య 67కు చేరింది.
> యూరప్లో వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ఇటలీలో మృతుల సంఖ్య 1016కు చేరింది. గురువారం ఒక్కరోజే 189 మంది చనిపోయారు. కొత్తగా 2651 మంది వైరస్ బారిన పడగా బాధితుల సంఖ్య 15 వేలు దాటింది. చికిత్సలో సాయం అందించేందుకు చైనా వైద్య బృందం ఇటలీ వెళ్లింది.
> ఇరాన్లో నిన్న ఒక్కరోజే 75 మంది మరణించగా.. మొత్తం సంఖ్య 429కి చేరింది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాడేందుకు రూ.37వేల కోట్ల రుణం కావాలని ఇరాన్ ఐఎంఎఫ్ను కోరింది.
> ఖతార్లో 262 కేసులు నమోదు కాగా, విద్యసంస్థల్ని పూర్తిగా మూసివేశారు.
> అగ్రరాజ్యం అమెరికాలోనూ కరోనా మరణాలు ఆగడం లేదు. ఇప్పటి వరకు 41 మంది మృతిచెందగా.. కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1729కి చేరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సైతం కరోనా సెగ తాకింది. అన్ని ప్రచార ర్యాలీలను తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కాలిఫోర్నియాలో ప్రఖ్యాత డిస్నీలాండ్ పార్క్ను మూసివేశారు. అమెరికా వ్యాప్తంగా పండుగలు, ఉత్సవాలపై ఆంక్షలు విధించారు. అనేక రాష్ట్రాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించారు. 500 మందికంటే ఎక్కువ మంది గుమిగూడకుండా న్యూయార్క్లో నిషేధాజ్ఞలు విధించారు.
> మరోవైపు ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ను కలిసిన బ్రెజిల్ అధికార ప్రతినిధికి సైతం కరోనా ఉన్నట్లు తేలింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తిపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ను సంవత్సరం పాటు వాయిదా వేయాలని ట్రంప్ కోరారు.
> ఐరోపా దేశాలను కరోనా తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తోంది. స్పెయిన్లో ఉద్ధృతి పెరుగుతుండడంతో నాలుగు ముఖ్య పట్టణాలను పూర్తిగా నిర్బంధంలో ఉంచారు. దీంతో దాదాపు 66 వేల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. నిన్న ఒక్కరోజే 31 కేసుల అదనంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓ మంత్రికి వైరస్ ఉన్నట్లు తేలడంతో అక్కడి మంత్రివర్గం, రాజవంశీకులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మరోవైపు బెల్జియం, రోమ్లలో చర్చిలను మూసివేశారు. రెండు వారాల పాటు విద్యాసంస్థల్ని మూసివేస్తున్నట్లు ఐర్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది.
> కరోనాను ‘అత్యంత దారుణ ప్రజారోగ్య సంక్షోభం’గా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఇప్పటివరకు ఆ దేశంలో 590 కేసులు నమోదైనప్పటికీ.. ఈ సంఖ్య ఐదు నుంచి 10 వేల మధ్య ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
> అటు దాయాది దేశం పాకిస్థాన్ను కరోనా కలవరపరుస్తోంది. ఇప్పటి వరకు అక్కడ 21 కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి దృష్ట్యా సింధ్ రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థల్ని మే 31 వరకు మూసివేశారు.
> బెంగళూరులోని గూగుల్ కార్యాలయంలో ఓ ఉద్యోగికి వైరస్ నిర్ధారణ కావడంతో దేశంలో బాధితుల సంఖ్య 75కు చేరింది. వీరిలో ఒకరు నిన్ని మరణించిన విషయం తెలిసిందే. పలు విమానాశ్రయాల్లో దాదాపు 11లక్షల 14వేల మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారీ జనం హాజరయ్యే ఐపీఎల్ వంటి క్రీడల నిర్వహణను అనుమతించబోమని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు.
> ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో 70 శాతం యూరప్లోనే నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షా 34 వేల మందికి పైగా సోకిన వైరస్ 4979 మందిని పొట్టనబెట్టుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది. -
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్ పతకం విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
తాము అధికారంలోకి వస్తే సంపద పునర్విభజనపై సర్వే చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా