145 దేశాలకు పాకిన కరోనా
కరోనా వైరస్ ప్రపంచం మొత్తం విస్తరించింది. ఇప్పటి వరకు 145 దేశాలకు పాకింది. లక్షా 45 వేల 631 మంది వైరస్ బాధితులుగా మారారు. 5,423 మంది మృతి చెందారు........
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ ప్రపంచం మొత్తం విస్తరించింది. ఇప్పటి వరకు 145 దేశాలకు పాకింది. లక్షా 45 వేల 631 మంది వైరస్ బాధితులుగా మారారు. 5,423 మంది మృతి చెందారు. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్ వ్యాప్తికి ఇప్పుడు ఐరోపా కేంద్రంగా మారిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఇంటి నుంచే తమ సేవల్ని అందించాలని కోరింది. ఇక తొలుత వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహాన్ నగరంలో వరుసగా తొమ్మిదో రోజు వైరస్ బాధితుల సంఖ్య తగ్గింది. చైనాలో శుక్రవారం 11 కేసులు నమోదయ్యాయి. మరో 13 మంది మృతిచెందగా.. మరణించిన వారి సంఖ్య 3,189కు చేరింది.
> దక్షిణ కొరియాలో కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరగుతోంది. కొత్తగా వైరస్ బారినపడుతున్న వారికంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉండడం విశేషం. శుక్రవారం కొత్తగా 107 మందికి వైరస్ సోకినట్లు ప్రభుత్వం ప్రటించింది. ఇప్పటి వరకు 67 మంది మృత్యువాత పడ్డారు.
> ఇటలీపై కరోనా తన పంజా విసురుతోంది. 24 గంట్లో 250 మంది పొట్టనబెట్టుకుంది. దీంతో మృతుల సంఖ్య 1,266కు చేరింది. కొత్తగా 2,500 మందికి వైరస్ సోకింది. దీంతో బాధితుల సంఖ్య 17,000 దాటింది.
> ఇజ్రాయెల్లోనూ పరిస్థితి తీవ్రమవుతోంది. దీంతో మాస్కులు, ఇతర ఔషధాలు తమ దేశానికి ఎగుమతి చేయాలని ఆ దేశ ప్రధాని నెతన్యాహూ భారత ప్రధాని మోదీని కోరారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో 150 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. మరో 35,000 మంది క్వారంటైన్లో ఉన్నారు.
> ఇప్పటి వరకు వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న లాటిన్ అమెరికా దేశాలకూ కరోనా వ్యాపించింది. ఈక్వెడార్లో శుక్రవారం తొలిమరణం సంభవించింది. వెనిజువెలా, ఉరుగ్వే, గ్వాటిమాలా, సురినామ్ దేశాల్లో తొలి కేసులు నమోదయ్యాయి. దీంతో పలు దేశాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
> అమెరికాలో పరిస్థితి ఆందోళనకంగా మారుతుండడంతో అక్కడ ఎమర్జెన్సీ విధించారు. దీంతో భారత్లోని ఆ దేశా రాయబార కార్యాలయం, కాన్సులేట్లలో మార్చి 16 నుంచి వీసా అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలోని భారత విద్యార్థులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని అక్కడ భారత రాయబార కార్యాలయం తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. ఇప్పటికే 24×7 హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో ఇప్పటి వరకు 49 మంది వైరస్ బారిన పడి మరణించారు. దాదాపు 2000 మందికి కరోనా సోకింది.
> కెనడా పార్లమెంటు సమావేశాల్ని రద్దు చేశారు. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో క్వారంటైన్లో ఉన్నారు. ఆయన భార్యకు వైరస్ సోకిన విషయం తెలిసిందే. దీంతో ట్రూడో ఇంటి నుంచే విధుల్ని నిర్వర్తిస్తున్నారు. కెనడాలో ఇప్పటి వరకు 138 మందిని వైరస్ సోకింది. ఒకరు చనిపోయారు.
> ఇరాన్లో 514 మందిని ఈ మహమ్మారి బలిగొంది. స్పెయిన్లో 133 మందిని, ఫ్రాన్స్లో 79 మందినిపొట్టనబెట్టుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)