24 గంటల్లో 14వేల కరోనా కేసులు..!
ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 14 వేల కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. దీంతో ఇప్పటి మొత్తం ప్రపంచదేశాల్లో 1,67,500 దాటినట్లు మంగళవారం పేర్కొంది......
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 14 వేల కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం ప్రపంచదేశాల్లో బాధితుల సంఖ్య 1,67,500 దాటినట్లు మంగళవారం పేర్కొంది. ఆయా దేశాల అధికారిక గణాంకాల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉన్నట్లు వివిధ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఐరాస భద్రతా మండలికి సంబంధించిన అన్ని రకాల సమావేశాల్ని వాయిదా వేస్తున్నట్లు యూఎన్ఎస్సీ ప్రకటింటింది. ఇప్పటికే తమ ఉద్యోగులు ఇంటి నుంచి సేవలందించాలని కోరిన విషయం తెలిసిందే.
పరీక్షలే మార్గం..
చైనాను వీడి ఐరోపాలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఆ దేశాల్ని పూర్తిగా నిర్బంధంలోకి నెట్టింది. ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ ప్రతి అనుమానిత వ్యక్తికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరింది. వైరస్ను కట్టడి చేయాలంటే ఇంతకు మించిన మార్గం లేదని సంస్థ చీఫ్ టెడ్రోస్ అధానోమ్ అభిప్రాయపడ్డారు. ఆంక్షలు, నిషేధాల పేరిట పరీక్షల నిర్వహణ ప్రక్రియను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దన్నారు.
విదేశీయులపైనే చైనా ఆందోళన..
తొలుత వెలుగులోకి వచ్చిన చైనాలో వైరస్ భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టింది. సోమవారం దేశీయంగా కేవలం ఒక్కకేసే నమోదు కాగా.. ఇతర దేశాల నుంచి వచ్చిన మరో 20 మందికి వైరస్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో కొత్తగా 21 కేసులు నమోదయ్యాయి. అయితే రోజుకు సగటున 20 వేల మంది చైనాలోకి ప్రవేశిస్తుండడం ఇప్పుడు ఆ దేశానికి ఆందోళన కలిగిస్తోంది. ఇక సోమవారం మరో 13 మంది మృతిచెందడంతో మృతుల సంఖ్య 3,226కు చేరింది.
మరో 15 రోజులు బయటకు రావొద్దు..
కరోనా వైరస్ వల్ల సోమవారం కొత్తగా మరో 21 మంది మృతిచెందడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించిన అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. నిబంధనల్ని ఉల్లఘించినవారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. రానున్న 15 రోజుల పాటు కఠిన ఆంక్షలు తప్పవని స్పష్టం చేశారు. ఐరోపా సమాఖ్య దేశాల సరిహద్దుల్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు ఫ్రాన్స్లో 148 మంది మృతిచెందగా.. 1,210 మంది వైరస్ సోకి బాధపడుతున్నారు.
నాలుగు రోజుల్లో రెండింతలైన మరణాలు..
ఇటలీ పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఒక్కరోజే 349 మరణాలు సంభవించాయి. దీంతో అక్కడ కరోనా మృతుల సంఖ్య 2,158కి చేరింది. గత నాలుగు రోజుల్లో మృతుల సంఖ్య రెండింతలు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత రెండు రోజుల్లోనే 700 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇప్పటికే ప్రజారవాణాపై భారీ ఆంక్షలు విధించిన అక్కడి ప్రభుత్వం సోమవారం బీచ్లకు కూడా ఆ నిబంధనల్ని విస్తరించింది.
పాకిస్థాన్లో ఒక్కరోజే 100 కేసులు..
దాయాది దేశం పాకిస్థాన్లోనూ వైరస్ తన ప్రతాపాన్ని ఉద్ధృతం చేసింది. సోమవారం ఒక్కరోజే దాదాపు 100కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ బాధితుల సంఖ్య 183కు చేరింది. ఒక్క సింధ్ ప్రావిన్సులోనే 150 మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో చాలా మంది దర్శనీయ స్థలాలకు వెళ్లొచ్చిన వారేనని అక్కడి అధికారులు తెలిపారు. తొలుత వీరిని బలూచిస్థాన్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. కానీ, అక్కడి ప్రభుత్వం చేతులెత్తేయడంతో వారందరినీ సొంత ప్రావిన్సులకు తరలించారు. దీంతో వైరస్ వ్యాప్తి ఒక్కసారిగా పెరిగింది.
ఇరాన్ ప్రభుత్వంలో ఉన్నతాధికారి మృతి..
కరోనా ప్రభావం అత్యధిక స్థాయిలో ఉన్న ఇరాన్లోనూ పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. ఇప్పటి వరకు సోమవారం ఒక్కరోజే 129 మంది మృతిచెందారు. దీంతో అక్కడ మృతుల సంఖ్య 853కు చేరింది. మరో 15,000 మంది వైరస్ బారిన పడ్డారు. సోమవారం ఓ ఉన్నతాధికారి మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు ఇరాన్లో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు కలిపి 12 మంది మరణించారు. మరో 13 మంది క్వారంటైన్లో ఉన్నారు.
7.3 బిలియన్ డాలర్లతో న్యూజిలాండ్ ప్యాకేజీ
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్తంభించిన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా న్యూజిలాండ్ 7.3 బిలియన్ అమెరికన్ డాలర్లు విలువ చేసే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. మేలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో మరిన్ని ప్రోత్సాహకాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ దేశంలో ఎనిమిది మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు.
* చిలీ, పెరూ, ఉక్రెయిన్, రష్యా విదేశీయుల రాకపై పూర్తిగా నిషేధం విధించాయి. ఆ దేశాల్లో అంతర్గత రవాణాపైనా ఆంక్షలు అమలు చేస్తున్నాయి. రష్యాలో ఇప్పటి వరకు 93 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.
దేశం | బాధితులు | మృతులు |
చైనా | 80,881 | 3,226 |
ఇటలీ | 27,980 | 2,158 |
ఇరాన్ | 14,991 | 853 |
స్పెయిన్ | 9,942 | 342 |
ఫ్రాన్స్ | 6,663 | 148 |
అమెరికా | 4,283 | 88 |
దక్షిణ కొరియా | 8,320 | 81 |
జర్మనీ | 6,012 | 14 |
యూకే | 1,543 | 55 |
జపాన్ | 814 | 24 |
భారత్ | 125 | 03 |
ప్రపంచవ్యాప్తంగా | 1,79,238 | 7,138 |
ప్రపంచవ్యాప్తంగా కోలుకున్నవారు: 79,611
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్