‘రేపిస్టుకు భార్యగా ఉండలేను’
రేపిస్టుకు భార్యగా ఉండలేనని నిర్భయ కేసులో దోషి అక్షయ్ఠాకూర్ భార్య కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేసింది.
ముంబయి: రేపిస్టుకు భార్యగా ఉండలేనని నిర్భయ కేసులో దోషి అక్షయ్ఠాకూర్ భార్య కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేసింది. 2012లో జరిగిన నిర్భయ గ్యాంగ్రేప్, అత్యాచారం కేసులో దోషులుగా తేలిన నలుగురిలో అక్షయ్ ఒకడు. ఒక రేపిస్టుకు భార్య అనే అపవాదుతో తాను జీవించలేనని ఆమె పిటిషన్లో పేర్కొంది. ఆమె పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. కాగా.. ఆ మర్నాడే మార్చి 20న అక్షయ్ఠాకూర్ ఉరికంబం ఎక్కనున్నాడు.
‘నా భర్త నిర్దోషి. కానీ హత్యాచారం కేసులో దోషిగా తేలింది. ఆయనకు ఉరిశిక్ష విదిస్తూ కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. కాబట్టి నేను అతని భార్యగా, వితంతువుగా జీవించలేను. అందుకే విడాకులు కోరుకుంటున్నాను’ అని ఆమె తన పిటిషన్లో పేర్కొంది. కాగా.. ఏ భార్య అయినా తన భర్త ఏదైనా కేసులో దోషిగా తేలితే విడాకులు తీసుకునేందుకు అర్హురాలు అని ఆమె తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే దోషుల్లో ముగ్గురు తమ కుటుంబాలను ఆఖరిచూపు చూసుకునే అవకాశాన్ని వినియోగించుకున్నారు. కావాలంటే అక్షయ్ఠాకూర్ను ఒకసారి చూసుకోవచ్చని అతని కుంటుంబానికి జైలు అధికారులు లేఖ రాశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్