‘చైనీస్ వైరస్’ సరైన పదం: ట్రంప్
ఓవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ కట్టడిపై దృష్టిసారిస్తే చిరకాల వైరివర్గాలు అమెరికా, చైనా మాత్రం పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. కరోనాను ‘చైనీస్ వైరస్’గా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు..........
ఆగని అమెరికా, చైనా పరస్పర నిందలు
వాషింగ్టన్: ఓవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ కట్టడిపై దృష్టిసారిస్తే చిరకాల వైరివర్గాలు అమెరికా, చైనా మాత్రం పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. కరోనాను ‘చైనీస్ వైరస్’గా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మాటల్ని సమర్థించుకున్నారు. ‘కరోనా’కు అమెరికాయే కారణమంటూ చైనా నిందలు వేయడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. అమెరికా సైన్యం వల్లే వైరస్ చైనాకు పాకిందనడం తప్పుడు ఆరోపణ అని అన్నారు. అయితే, ఈ క్రమంలో అది ఎక్కడ నుంచి వచ్చిందో.. దాని పేరు పెట్టి పిలవడం ఏమాత్రం తప్పుకాదన్నారు. ‘చైనీస్ వైరస్’ అని వ్యవహరించడం సరైన పదమేనన్నారు. చైనాకు ప్రయాణాలను నిషేధించి తాను మంచిపని చేశానని వ్యాఖ్యానించారు. అయితే, చైనాతో విభేదాల వల్ల ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడిసరకు దిగుమతుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న వాదనను ట్రంప్ కొట్టపారేశారు. ఇటీవల ఇరు దేశాల మధ్య కుదిరిన తొలిదశ ఒప్పందాన్ని చైనా ఉల్లంఘిస్తుందని తాను భావించడం లేదన్నారు. చైనాకు అమెరికా ఉత్పత్తులు చాలా అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సత్సంబంధాలను చైనా కొనసాగిస్తుందని జోస్యం చెప్పారు. చైనాలో కంటే ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్వో) ఉద్ఘాటించిన రోజునే అమెరికా-చైనాలు పరస్పరం విమర్శలకు దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇంటి వాతావరణాన్ని ఆస్వాదించండి...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ట్రంప్ సూచించారు. రానున్న 15 రోజుల చాలా కీలకమని.. అందరూ ఇంట్లోనే ఉండి ఇంటి వాతావరణాన్ని ఆస్వాదించాలని పిలుపునిచ్చారు. సమస్య త్వరలోనే అదుపులోకి వస్తుందని అప్పటి వరకు ఆంక్షలు తప్పవన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు రోజురోజుకీ మారిపోతున్నాయని.. అమెరికాలో మాత్రం పరిస్థితి బాగానే ఉందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సూచనలు పాటించనట్లైతే వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తుందని.. పరిస్థితులు చేదాటిపోతే ఆర్థిక వ్యవస్థ కూడా ఘోరంగా దెబ్బతింటుందని హెచ్చరించారు.
ఇక అమెరికాలో కరోనా వైరస్ ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు పాకింది. ఇప్పటి వరకు 103 మంది మరణించగా.. దాదాపు 4500 మందికి వైరస్ సోకింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!