నిర్భయ దోషులకు యథాతథంగా ఉరిశిక్ష

నిర్భయ హత్యాచార ఘటనలో దోషులకు దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. మరికొన్ని గొంటల్లో ఉరిశిక్ష ఎదుర్కోనున్న నలుగురు దోషుల్లో ముగ్గురు మరోసారి హైకోర్టు తలుపు తట్టిన విషయం తెలిసిందే. అయితే వారి పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది....

Updated : 20 Mar 2020 00:39 IST

దిల్లీ హైకోర్టు తీర్పు

దిల్లీ: నిర్భయ హత్యాచార ఘటనలో దోషులకు దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. డెత్‌వారెంట్లపై స్టే ఇవ్వని పటియాల హౌస్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ..నలుగురు దోషుల్లో ముగ్గురు మరోసారి హైకోర్టు తలుపు తట్టిన విషయం తెలిసిందే.  అయితే మరికొన్ని గంటల్లో  ఉరిశిక్ష ఎదుర్కోనున్న వీరి పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ మన్మోహన్‌ నేతృత్వంలోని ధర్మాసనం యథాతథంగా ఉరిశిక్ష అమలు చేయాలని తీర్పునిచ్చింది. నిర్భయ దోషుల తరఫు న్యాయవాది లేవనెత్తిన అంశాలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఉరి అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో  శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తిహాడ్‌ కేంద్ర కారాగారంలో నిర్భయ దోషులను ఉరి తీయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని