కరోనా మరణాల్లో చైనాను దాటేసిన ఇటలీ
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు అమెరికాలో మరణించిన వారి సంఖ్య 200కు చేరింది. దీంతో ప్రజలను ఆదుకునేందుకు సెనేట్ రిపబ్లికన్లు 1 ట్రిలియన్ డాలర్లతో ఉద్దీపన చర్యలను ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాను కరోనా వణికిస్తోంది. రోజురోజుకి బాధితుల సంఖ్య పెరగడంతోపాటు మరణించిన వారి సంఖ్య 200కు చేరింది. దీంతో ప్రజలను ఆదుకునేందుకు సెనేట్ రిపబ్లికన్లు 1 ట్రిలియన్ డాలర్లతో ఉద్దీపన చర్యలను ప్రకటించారు. ‘కరోనా వైరస్కు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని చైనా దాచడం మూలంగా ప్రపంచం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది’అని అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా అమెరికా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
వీడియో కాన్ఫరెన్సులో జీ7 సదస్సు
కరోనా ప్రభావం కారణంగా జూన్లో జరగాల్సిన జీ7 దేశాల సదస్సును రద్దు చేస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. దీన్ని వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించనున్నట్లు వైట్హౌజ్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా ప్రభావంతో ప్రతి దేశం తమ ఆరోగ్య, ఆర్థిక సవాళ్లపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. మరోవైపు అమెరికాలో గంటల లెక్కన పనిచేసే వారికి (అవర్లీ వర్కర్స్) డిమాండు పెరిగింది. బిగ్బాక్స్ రిటైలర్ వాల్ మార్ట్ 1.5లక్షల మంది అవర్లీ వర్కర్స్ను నియమించుకునేందుకు సిద్ధమైంది. కాలిఫోర్నియాలో ప్రజలను ఇళ్ల వద్దే ఉండాలంటూ గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆదేశించారు. ప్రజలను కేవలం నిత్యావసరాల కొనుగోలుకు మాత్రమే బయటకు అనుమతించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 56శాతం మంది ప్రజలు శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.
రూబీ ప్రిన్సెస్ ప్రయాణికులకు హెచ్చరికలు
ఆస్ట్రేలియాలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు బహిరంగ సమావేశాలను నిషేధించారు. పాఠశాలలు, ప్రజా రవాణా వ్యవస్థను సైతం నిలుపుదల చేశారు. సిడ్నీలో ఉన్న రూబీ ప్రిన్సెస్ నౌకలో నుంచి దిగిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో నౌకలో ఇప్పటికే ప్రయాణించిన వారిని వెంటనే స్వీయ నిర్బంధంలో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయాన్ని న్యూసౌత్వేల్స్ ఆరోగ్య మంత్రి బ్రాడ్ హజర్డ్ తెలిపారు. నౌకలో మొత్తం 2,700 మంది ప్రయాణించినట్లు సమాచారం.
చైనాను దాటిన ఇటలీ
ఇటలీపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా కొనసాగుతోంది. ఆ దేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య చైనాను దాటిపోయింది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,400కు చేరింది. కాగా చైనాలో ఆ సంఖ్య 3,245 వద్ద ఉంది. మరోవైపు బుధవారం నాడు ఇటలీలో ఒక్క రోజులోనే అత్యధికంగా 475 మంది కరోనా కారణంగా మృతి చెందగా.. గురువారం 427 మంది మరణించారు. ఇప్పటివరకు ఇటలీలో వైరస్ బాధితుల సంఖ్య 41,035కు చేరినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రతి పది నిమిషాలకు ఒక ప్రాణం
కరోనా వైరస్ మహమ్మారి ప్రతి పది నిమిషాలకు ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటోందని ఇరాన్ ఆరోగ్య శాఖ ప్రతినిధి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇరాన్లో కొవిడ్-19 మరణాల సంఖ్య 1,284కు చేరింది. మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 18,407కు చేరింది. కాగా ప్రపంచవ్యాప్తంగానూ కరోనా ప్రభావం కొనసాగుతోంది.
చైనాలో విదేశీ కేసుల పెరుగుదల
చైనాలో దేశీయంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ విదేశాల నుంచి కరోనాతో వచ్చిన వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా గురువారం 39 కొత్త కరోనా కేసులు నమోదు కాగా వారంతా విదేశాల నుంచి వచ్చినట్లు ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. దీంతో చైనాలో వీరి సంఖ్య 228కి పెరిగింది.
అర్జెంటీనా లాక్డౌన్
దక్షిణ అమెరికాలో కరోనా ప్రభావంతో అర్జెంటీనా లాక్ డౌన్ అయింది. పౌరులు ఇళ్ల నుంచి బయటికి రావడాన్ని నిషేధించారు. మార్చి ఆఖరు వరకూ ఆహారపదార్థాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అర్జెంటీనాలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా.. 128 మంది వైరస్ బారిన పడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,45,652కు చేరుకుంది. మరణాల సంఖ్య 10,050గా నమోదైంది.
దేశం | బాధితులు | మృతులు |
చైనా | 80,967 | 3248 |
ఇటలీ | 41,035 | 3405 |
ఇరాన్ | 18,407 | 1284 |
స్పెయిన్ | 18,077 | 831 |
జర్మనీ | 15,320 | 44 |
యూఎస్ఏ | 14,322 | 218 |
ఫ్రాన్స్ | 10,995 | 372q |
ద.కొరియా | 8,652 | 94 |
స్విట్జర్లాండ్ | 4,222 | 43 |
యూకే | 3,269 | 144 |
భారత్ | 206 | 4 |
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
లోక్సభ ఎన్నికల తొలి దశకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 సీట్లకు శుక్రవారం (ఏప్రిల్ 19న) పోలింగ్ నిర్వహించనున్నారు. -
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
ద్రవిడనాట పట్టు బిగించాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని మోదీ.. ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విస్తృత పర్యటన చేశారు. -
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
Dubai Rains: దుబాయ్లో చిక్కుకున్న భారతీయుల కోసం అక్కడి మన దౌత్య కార్యాలయం హెల్ప్లైన్ నంబర్లు విడుదల చేసింది. -
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్టుగా ఇటీవల బాలీవుడ్ నటుడు ఆమిర్ఖాన్ వీడియో వైరల్ కాగా, తాజాగా రణ్వీర్సింగ్కు అదే పరిస్థితి ఎదురైంది. -
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న లైంగిక ఆరోపణల కేసులో మరింత విచారణ జరపాలని కోరుతూ బ్రిజ్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలోనే న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. -
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ నౌకా సిబ్బందిలో కేరళ మహిళను విడుదల చేశారు. దీంతో ఆమె నేడు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. -
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసులో నిందితుల నుంచి కీలక వివరాలు బయటపడుతున్నాయి. వారు ఈ దాడి కుట్రకు వాడేసిన పాత ఫోన్లనే వినియోగించినట్లు తేలింది. -
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
అంతరిక్షం కూడా భవిష్యత్ యుద్ధాలకు వేదికగా మారిందని భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. -
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!