న్యాయమే గెలిచింది: మోదీ
నిర్భయ దోషుల ఉరిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘‘ఎట్టకేలకు న్యాయమే గెలించిందని వ్యాఖ్యానించారు. మహిళలకు భద్రత, గౌరవాన్ని కల్పించడం చాలా ముఖ్యం...........
దిల్లీ: నిర్భయ దోషుల ఉరిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘‘ఎట్టకేలకు న్యాయమే గెలించింది. మహిళలకు భద్రత, గౌరవాన్ని కల్పించడం చాలా ముఖ్యం. ప్రతి రంగంలో మన మహిళా శక్తి రాణిస్తోంది. మహిళా సాధికారితకు అత్యంత ప్రాముఖ్యతనిస్తూ వారికి సమాన అవకాశాలు కల్పించే మెరుగైన సమాజాన్ని అందరం కలిసి నిర్మిద్దాం’’ అని మోదీ పిలుపునిచ్చారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా దోషుల ఉరిపై స్పందించారు. ‘‘దేశ చరిత్రలో అత్యంత హేయమైన నేరానికి పాల్పడిన దోషులకు ఉరి పడింది. ఇది ఎప్పుడో జరగాల్సిందని నా అభిప్రాయం. దోషులుగా తేలిన వారు ఏడేళ్ల పాటు శిక్ష అమలును ఆలస్యం చేయడానికి వ్యవస్థను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేశారు. ఇలాంటి విధానాలను కొనసాగించాలో.. లేదో.. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, పౌరసమాజం ఆలోచించాల్సిన రోజిది’’ అని రవిశంకర్ అభిప్రాయపడ్డారు.
నిర్భయ కేసులో దోషులైన ముకేశ్ సింగ్ (32), పవన్ గుప్త (25), వినయ్ శర్మ (26), అక్షయ్ ఠాకూర్ (31)లను తిహార్ జైలులో ఈరోజు ఉదయం 5:30గంటలకు ఉరి తీశారు. శిక్ష నుంచి తప్పించుకోవడానికి చివరి క్షణం వరకూ వారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. వారు దాఖలు చేసిన పిటిషన్లంటినీ న్యాయస్థానాలు కొట్టివేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!