గాడ్సే నుంచి నిర్భయ దోషుల వరకు..
ప్రపంచంలో అత్యంత ఘోరమైన నేరాల్లో ఒకటైన నిర్భయ కేసులో ఎట్టకేలకు దోషులకు శిక్ష అమలైంది. ఈరోజు ఉదయం దోషులైన ముకేశ్ సింగ్, పవన్ గుప్త, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్లను తిహాడ్ జైలులో ఈరోజు ఉదయం 5:30గంటలకు ఉరి తీశారు.......
దిల్లీ: ప్రపంచంలో అత్యంత ఘోరమైన నేరాల్లో ఒకటైన నిర్భయ కేసులో ఎట్టకేలకు దోషులకు శిక్ష అమలైంది. దోషులైన ముకేశ్ సింగ్, పవన్ గుప్త, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ను తిహాడ్ జైలులో ఈరోజు ఉదయం 5:30గంటలకు ఉరి తీశారు. ఇలా నలుగురికీ ఒకేసారి మరణ దండన విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో ఉరిశిక్ష సమంజసమేనా.. కాదా.. అన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మన దేశంలో ఉరిశిక్ష అమలు చరిత్రను ఓ సారి చూద్దాం..
ఇటీవలి ఉరిశిక్షలు..
నిర్భయ దోషుల కంటే ముందు 2015లో చివరిసారి ఉరిశిక్షను అమలు చేశారు. 1993 ముంబయి పేలుళ్లలో కీలక పాత్ర పోషించిన యాకూబ్ మెమన్ను 2015 జులై 30న నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఉరికంబం ఎక్కించారు. అంతకుముందు పార్లమెంటుపై దాడికి కుట్రపన్నిన అఫ్జల్ గురును 2013, ఫిబ్రవరి 8న తిహాడ్ జైలులో ఉరితీశారు. 2008లో ముంబయి ఉగ్రదాడిలో పట్టుబడ్డ ముష్కరుడు అజ్మల్ కసబ్ను 2012, నవంబరు 12న ఉరి తీశారు. 2004లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన ధనుంజయ్ ఛటర్జీకి మరణ శిక్ష అమలు చేశారు. అంతకుముందు వరుస హత్యలకు పాల్పడ్డ ఆటో శంకర్ అలియాస్ గౌరీ శంకర్ను 1995లో ఉరితీశారు. గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన నాథూరామ్ గాడ్సేను 1949లో దేశంలో మొట్టమొదటిసారి ఉరితీశారు. ఈ కేసులో కుట్రదారుడు నారాయణ్ ఆప్టేకి కూడా మరణ శిక్ష అమలు చేశారు. అనంతరం 1989లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య కేసులో దోషులు సత్వంత్ సింగ్, ఖేహర్ సింగ్ను ఉరి వేశారు.
ఇప్పటి వరకు ఎంతమందికి...
దిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ(ఎన్ఎల్యూ) సేకరించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో 755 మందిని ఉరితీశారు. అయితే ఈ సంఖ్య ఎక్కువే ఉండే అవకాశం ఉందన్న వాదనా ఉంది. చాలా జైళ్లలో ఉరికి సంబంధించిన రికార్డులు లేకుండా పోవడంతో సంఖ్యపై అస్పష్టత ఏర్పడిందని ఎన్ఎల్యూ ఓ సందర్భంలో తెలిపింది. దీంతో ప్రతి జైలుని సంప్రదించి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించింది. ఎన్ఎల్యూ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు అత్యధిక మరణ శిక్షలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేశారని తెలుస్తోంది.
ఏయే నేరాలకు మరణశిక్ష..
హత్య, హత్యాయత్నం, హత్యాచారం, సామూహిక అత్యాచారం, దేశద్రోహం, సైన్యంలో తిరుగుబాటు, మాదక ద్రవ్యాల సరఫరా వంటి తీవ్ర నేరాలకు భారత్లో మరణ దండన విధిస్తున్నారు. దేశంలో భారత శిక్షా స్మృతి(ఐపీసీ) వివిధ సెక్షన్ల కింద వీటిని విధించవచ్చు. మరణ శిక్షకు అవకాశం గల మరో 24 కేంద్ర, రాష్ట్ర చట్టాలు కూడా ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం పౌరులందరికీ జీవించే హక్కు ఉంది. దీనికి భంగం కలిగించే ప్రయత్నాలు చేయడమే ఉరిశిక్షకు ప్రామాణికం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.