‘సార్క్‌ తరఫున భారత్‌ గొప్ప ముందడుగు’

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు సార్క్‌ దేశాలతో కలిసి భారత్‌ ముందడుగు వేయడం ఎంతో గొప్ప విషయమని అమెరికా ప్రశంసింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌ శుక్రవారం టెలిఫోన్‌ ద్వారా సంభాషించారు.

Published : 21 Mar 2020 12:33 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు సార్క్‌ దేశాలతో కలిసి భారత్‌ ముందడుగు వేయడం ఎంతో గొప్ప విషయమని అమెరికా ప్రశంసింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌ శుక్రవారం టెలిఫోన్‌ ద్వారా సంభాషించారు. ఇందులో భాగంగా ఇద్దరు నాయకులు కొవిడ్‌ మహమ్మారి గురించి చర్చించినట్లు ఆ దేశ రక్షణ విభాగం పెంటగాన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ‘కరోనా విషయంలో పరస్పరం భాగస్వామ్యంతో కట్టడికి కృషి చేయాలని ఇరువురు నేతలు చర్చించారు. ద్వైపాక్షిక రక్షణ రంగ విషయాలు.. రాబోయే రోజుల్లో ప్రాంతీయ సహకారం, రక్షణాత్మక వాణిజ్యం, సైనిక సహకారం గురించి మాట్లాడారు. కొవిడ్‌ను నియంత్రించేందుకు దక్షిణ ఆసియా దేశాల(సార్క్‌) తరఫున నాయకత్వం వహించి భారత్‌ ముందడుగు వేయడాన్ని ఎస్పర్‌ ప్రశంసించారు. అవకాశం దొరికితే వీలైనంత తొందరలోనే ఎస్పర్‌ భారత పర్యటనకు రానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ నేపథ్యంలో పర్యటన వాయిదా వేసుకున్నట్లు తెలిపారు’ అని పెంటగాన్ తెలిపింది. అమెరికాలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 13వేలకు చేరింది. కాగా మృతుల సంఖ్య 230కు పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని