శానిటైజర్‌, మాస్క్‌ ధరలు ఇంతలోపే ఉండాలి..

దేశంలో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తిని అసరాగా చేసుకుని శానిటైజర్‌, మాస్క్‌ల ధరలు చుక్కలనంటుతున్నాయి.

Updated : 21 Mar 2020 13:06 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తిని ఆసరాగా చేసుకుని శానిటైజర్‌, మాస్క్‌ల ధరలు చుక్కలనంటుతున్నాయి. రిటైల్‌ దుకాణాలే కాకుండా ఆన్‌లైన్‌ సంస్థలు కూడా వీటి రేట్లను విపరీతంగా పెంచేస్తున్నాయి. ఈ దోపిడీని అరికట్టడానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాశవాన్‌ హెచ్చరికలు జారీ చేశారు. 200 ఎంఎల్‌ శానిటైజర్ బాటిల్‌ ధర రూ.100, మాస్క్‌ ధర రూ.10కి మించరాదని ఆయన ప్రకటించారు. ఈ ఆదేశాలు 30 జూన్‌, 2020 వరకూ అమలులో ఉంటాయని తెలిపారు.

ప్రస్తుతం భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 271కి చేరింది. కరోనా వైరస్‌ దరిచేరకుండా ఉండాలంటే చేతులను శుభ్రంగా ఉంచుకోవటం, సామాజిక దూరం పాటించటం అతి ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో శానిటైజర్లు, మాస్కులకు డిమాండు విపరీతంగా పెరిగింది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని వాటి ధరలు పెంచి విక్రయిస్తున్నారంటూ పలువురు సోషల్‌ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. కొన్ని కంపెనీలు మాస్కులు, శానిటైజర్లను 15 రెట్ల అధిక ధరకు కూడా అమ్ముతున్నాయని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వీటి ధరలను నియంత్రిస్తూ కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.



 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు