రైలు ప్రయాణం రద్దుచేస్తే పూర్తి సొమ్ము వాపసు
రైలు ప్రయాణాలు రద్దు చేసుకున్న ప్రయాణీకులకు పూర్తి టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని భారతీయ రైల్వే ప్రకటించింది.
దిల్లీ: రైలు ప్రయాణాలు రద్దు చేసుకున్న వారికి టికెట్ సొమ్ము మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని భారతీయ రైల్వే ప్రకటించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 15 మధ్యకాలంలో ప్రయాణించేందుకు చేసుకున్న రిజర్వేషన్లకు ఈ సౌకర్యం వర్తిస్తుందని అధికారులు వివరించారు. బహిరంగ స్థలాల్లో అనవసర రద్దీని నిరోధించేందుకు, సామాజిక దూరాన్ని ప్రోత్సహించేందుకు తాము ఈ నిర్ణయానికి వచ్చినట్టు రైల్వేశాఖ తెలిపింది. ఇటీవలి కాలంలో మొత్తం 245 రైలు సర్వీసులను రద్దు చేసిన రైల్వేశాఖ, సంబంధిత ప్రయాణీకులకు పూర్తి మొత్తాన్ని వాపసు చేసిన సంగతి తెలిసిందే. కాగా, నడుస్తున్న రైళ్లలో రిజర్వేషన్లను రద్దు చేసుకున్నా... సర్వీసు ఛార్జీలు మినహాయించకుండా పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ఆ శాఖ తాజా ప్రకటనలో వివరించింది.
జనతా కర్ఫ్యూ... తిరగని రైళ్లు
జనతా కర్ఫ్యూ సందర్భంగా... దేశంలోని పాసింజర్ రైళ్లు శనివారం అర్ధ రాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు నడవవని రైల్వేశాఖ ప్రకటించింది. ఇక మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి తిరగవు. కాగా, ఇంటర్సిటీ రైళ్లను కూడా ఆదివారం రాత్రి 10 గంటల వరకు నిలిపివేస్తామని రైల్వే అధికారులు వివరించారు. ఆపై ముంబయి, దిల్లీ, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని సబర్బన్ రైలు సర్వీసుల సంఖ్యను పరిమితం చేస్తున్నామని వారు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.