60వేల కోట్ల టన్నుల మంచు కరిగిపోయిందట!
గ్రీన్లాండ్...ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. అక్కడంతా ఎటుచూసినా మంచే. అయితే గత సంవత్సరం వచ్చిన రెండు నెలల ఎండలకే ఏకంగా 60వేల కోట్ల టన్నుల మంచు కరిగిపోయినట్లు బుధవారం నాసా వెల్లడించింది.
గ్రీన్లాండ్.. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. అక్కడంతా ఎటుచూసినా మంచే. అయితే గతేడాది రెండు నెలల ఎండలకే ఏకంగా 60వేల కోట్ల టన్నుల మంచు కరిగిపోయినట్లు బుధవారం నాసా వెల్లడించింది. నాసా చేసిన ఓ అధ్యయనంలో ప్రపంచ సముద్ర మట్టాలను 2.2 మిల్లీమీటర్ల మేర పెంచడానికి గ్రీన్లాండ్లో కరిగిన మంచు మాత్రమే సరిపోతుందని, దీంతో భారీ నష్టం కలుగుతుందని వెల్లడైంది.
‘గత వేసవిలో ముఖ్యంగా గ్రీన్లాండ్లో వాతావరణం వెచ్చగా ఉందని, ఈ వేడి మంచు పలక ప్రతి మూలను కరిగించిందని మాకు తెలుసు, కానీ కరిగిన మంచు పరిమాణం ఇంత ఉంటుందనుకోలేదు’ అని అధ్యయనంలో పాల్గొనిన కాలిఫోర్నియా-ఇర్విన్ విశ్వవిద్యాలయంలో ఎర్త్ సైన్స్ ప్రొఫెసర్ ఇసాబెల్లా వెలికోగ్నా, నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీలో పనిచేసే ఓ సీనియర్ శాస్త్రవేత్త ఓ వార్తా ప్రకటనలో తెలిపారు.
ఈ అధ్యయనాన్ని జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్ ప్రచురించింది. దీని ప్రకారం... గ్రావిటీ రికవరీ అండ్ క్లైమేట్ ఎక్స్పెరిమెంట్ ఫాలో-ఆన్(గ్రేస్-ఫో) మిషన్ అనే కొత్త ఉపగ్రహ వ్యవస్థ. 2017 నుంచి పనిచేస్తుంది. ఇది గురుత్వాకర్షణ-సెన్సింగ్ ఉపగ్రహాలకి అనుగుణంగా ఉంటుంది. భూమి కొలతలను పై నుంచి కనుగొంటుంది. ఇది ఉపగ్రహ-ఆధారిత మంచు ద్రవ్యరాశి నష్ట రికార్డును 17 సంవత్సరాలకు అంచనా వేస్తుంది. ఈ డేటా మార్చి 2002 నుంచి ప్రారంభమవుతుంది. ఈ డేటా సెట్లలో స్వల్ప అంతరాన్ని కలిగి ఉంది. మంచు పలకల ద్రవ్యరాశి పెరగడం, తగ్గడం వలన భూమి గురుత్వాకర్షణ క్షేత్రంలో జరిగే చిన్న మార్పులను ఈ ఉపగ్రహాలు గ్రహించగలవు. అలాగే ప్రపంచవ్యాప్తంగా భూగర్భ జల నిల్వలను అధ్యయనం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. 2002 నుంచి 2019 మధ్య, రెండు ఉపగ్రహ కార్యకలాపాల పూర్తి సమయ శ్రేణిలో, గ్రీన్లాండ్ 4లక్షల 55వేల కోట్ల టన్నుల మంచును అంటే సంవత్సరానికి సగటున 26.5వేల కోట్ల టన్నుల మంచు కరిగిపోయిందని కనుగొన్నారు.
ఈ అధ్యయనం అంటార్కిటికాలో మంచు నష్టాన్ని కూడా పరిశీలించింది. ఈ పరిశీలనలో అంటార్కిటిక్ ద్వీపకల్పం, పశ్చిమ అంటార్కిటికాలో మంచు కరగడం కొనసాగుతుందని తెలిసింది. అముండ్సెన్ సముద్ర అఖాతంతో సహా, తూర్పు అంటార్కిటికాలో క్వీన్ మౌడ్ లాండ్ అని పిలువబడే ఒక భాగంలో పెరిగిన హిమపాతం నుంచి భారీ లాభం చేకూరుతుందని వెల్లడైంది. తూర్పు అంటార్కిటికాలో పెరిగిన ద్రవ్యరాశిని, హిమపాతాన్ని సూచిస్తుందని, ఇది పశ్చిమ అంటార్కిటికాలో వేగంగా ప్రవహించే మంచు ప్రభావాన్ని ప్రభావితం చేస్తుందని తెలిసింది.
ముందున్న గ్రేస్ ఉపగ్రహాలు చేసిన అదే మంచు షీట్ డైనమిక్లను గ్రేస్ ఫో డేటా కూడా మొదటిసారి సంగ్రహించిందని అధ్యయనంలో వెల్లడైంది. ఇది ఈ సమాచారంపై ఆధారపడిన శాస్త్రవేత్తలకు ఉపశమనం కలిగిస్తుంది. ఉన్న రికార్డుల మధ్య పెద్ద అంతరాలు లేదా అసమానతలు లేవని తెలియజేస్తుంది. సాధారణంగా, ఏదైనా కొత్త వ్యత్యాసాలను తొలగించడానికి, కొత్త ఉపగ్రహ మిషన్ని పాతదానితో కలిపి చూస్తారు. అయితే ఈ సందర్భంలో, ముందు తరం ఉపగ్రహాలు చేసే పని నుంచి బయటకు వచ్చాకే గ్రేస్ ఫో ఉపగ్రహాలు ప్రయోగించడానికి సిద్ధంగా ఉంటాయి.
‘అధ్యయనం చూపించేది ఏమిటంటే, రెండు ఉపగ్రహ కార్యకలాపాల మధ్య మాకు చాలా స్థిరమైన డేటా సెట్ ఉంది. గ్రీన్లాండ్లో 2019, ఒక ప్రధాన ద్రవీభవన సంవత్సరం. ఈ సమయంలో ముందుకన్నా ఎక్కువ నష్టం వాటిల్లింది. ఇది గ్రీన్లాండ్లోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో హిమానీనదాలలో సంభవించిన ముఖ్యమైన ద్రవీభవనం’ అని వెలికోగ్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
గ్రీన్లాండ్ ఉత్తర ప్రాంతంలో తక్కువ మేఘావృతం కావడం, నిరంతర అధిక పీడన ప్రాంతాల వలన గత సంవత్సరం మంచు ఎక్కువగా కరిగిందని ఈ అధ్యయనంలో పాల్గొన్న యుసి ఇర్విన్కు చెందిన మొహజెరానీ పేర్కొన్నారు.
‘భవిష్యత్తులో సముద్ర మట్టం పెరుగుదలపై తమ అంచనాలను తగ్గించాలని కోరుకునే పరిశోధకులకు ఈ అధ్యయనం విలువైనది. మంచు పలకలు ఎలా మారుతున్నాయో మనం నిజంగా చూడగలిగే అందమైన నవీకరణ. . . గ్రీన్లాండ్లో శీతాకాలంలో మంచు పేరుకుపోయి వేసవిలో కరుగుతున్నప్పుడు జరిగే మార్పులను గమనించవచ్చు’ అని అధ్యయనంలో పాల్గొన్న కొలంబియా విశ్వవిద్యాలయంలోని ఐస్ షీట్ డైనమిక్స్ నిపుణులు రాబిన్ బెల్ అన్నారు.
‘‘ఇది సైన్స్ కమ్యూనిటీకి పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. గ్రీన్లాండ్ కరుగుతున్నందుకు ఉపశమనం లేదు. కానీ, దాన్ని కొలిచే మా సాధనం పనిచేస్తోంది’’ అని అధ్యయనంలో పాలుపంచుకోని నాసా జెపిఎల్లోని వాతావరణ పరిశోధకుడు జోష్ విల్లిస్ అన్నారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించడంపై ఆప్ స్పందించింది. ఆయనను చంపేందుకు కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేసింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
లోక్సభ ఎన్నికల తొలి దశకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 సీట్లకు శుక్రవారం (ఏప్రిల్ 19న) పోలింగ్ నిర్వహించనున్నారు. -
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
ద్రవిడనాట పట్టు బిగించాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని మోదీ.. ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విస్తృత పర్యటన చేశారు. -
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
Dubai Rains: దుబాయ్లో చిక్కుకున్న భారతీయుల కోసం అక్కడి మన దౌత్య కార్యాలయం హెల్ప్లైన్ నంబర్లు విడుదల చేసింది. -
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్టుగా ఇటీవల బాలీవుడ్ నటుడు ఆమిర్ఖాన్ వీడియో వైరల్ కాగా, తాజాగా రణ్వీర్సింగ్కు అదే పరిస్థితి ఎదురైంది. -
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న లైంగిక ఆరోపణల కేసులో మరింత విచారణ జరపాలని కోరుతూ బ్రిజ్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలోనే న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. -
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ నౌకా సిబ్బందిలో కేరళ మహిళను విడుదల చేశారు. దీంతో ఆమె నేడు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. -
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసులో నిందితుల నుంచి కీలక వివరాలు బయటపడుతున్నాయి. వారు ఈ దాడి కుట్రకు వాడేసిన పాత ఫోన్లనే వినియోగించినట్లు తేలింది. -
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
అంతరిక్షం కూడా భవిష్యత్ యుద్ధాలకు వేదికగా మారిందని భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. -
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM