కరోనా ఎఫెక్ట్‌: షాహీన్‌బాగ్‌ ఖాళీ

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని షాహీన్‌ బాగ్‌ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేస్తున్న వారిని ఎట్టకేలకు పోలీసులు మంగళవారం సాయంత్రం అక్కడి నుంచి తొలగించారు........

Updated : 24 Mar 2020 15:20 IST

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని షాహీన్‌ బాగ్‌ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేస్తున్న వారిని ఎట్టకేలకు పోలీసులు మంగళవారం సాయంత్రం అక్కడి నుంచి తొలగించారు. ఈ క్రమంలో పోలీసుల చర్యను వ్యతిరేకించిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దాదాపు దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్న విషయం తెలిసిందే. దిల్లీలోనూ కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని నిరసనకారుల్ని కోరినప్పటికీ.. గత కొన్ని రోజులుగా నిరాకరిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు వైరస్‌ వ్యాప్తి క్రమంగా విస్తరిస్తుండడంతో వారిని అక్కడి నుంచి పంపించేశామని పోలీసు అధికారులు తెలిపారు. ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ సందర్భంగానూ దాదాపు నిరసనకారులంతా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. కేవలం అయిదుగురు మహిళలు మాత్రం అక్కడే ఉండి ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు మూడు నెలల తర్వాత షాహీన్‌ బాగ్‌ నిరసనలకు లాక్‌డౌన్‌ కారణంగా బ్రేక్‌ పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని