లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: గుడి బయటే ఒక్కటైన జంట 

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని

Published : 31 Mar 2020 01:42 IST

మదురై: కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించడంతో ముందస్తుగా ఏర్పాటు చేసుకున్న వివాహాలు, ఇతర కార్యక్రమాలను ప్రజలు వాయిదా వేసుకుంటున్నారు. దేవాలయాలు, ఇతర ప్రార్థనా ప్రదేశాలతో సహా జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాలు 21 రోజలు పాటు మూసివేశారు. ఈ నేపథ్యంలో కొందరు తమ వివాహాలను దేవుడి సన్నిధిలో జరుపుకోవాలనే ఉద్దేశంతో గుడి ముందు బంధువుల సమక్షంలో ఒక్కటవుతున్నారు. తాజాగా మదురైకి చెందిన వధూవరులు తమ వివాహాన్ని తిరుపురుకుండ్రంలోని మురుగన్‌ గుళ్లో జరిపించుకోవాలనుకున్నారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా గుడి మూసివేయడంతో, గుడి తలుపులు ముందు బంధువుల సమక్షంలో వధువు మెళ్లో వరుడు తాళి కట్టాడు. దీనికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు తమిళనాడులో 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 1071 కరోనా బారిన పడ్డారు. వీరిలో 99 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని