చైనా వాళ్లు మళ్లీ తింటున్నారు..
మానవాళికే ముప్పుగా తయారైన కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యల దీనిబారిన పడ్డారు. దీనంతటికీ కారణం ఎవరని ప్రశ్నిస్తే మాత్రం చైనా వైపు వేలెత్తిచూపక తప్పదు.
బీజింగ్: మానవాళికే ముప్పుగా తయారైన కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యలో ప్రజలు దీనిబారిన పడ్డారు. దీనంతటికీ కారణం ఎవరని ప్రశ్నిస్తే మాత్రం చైనా వైపు వేలెత్తి చూపక తప్పదు. ఇలాంటి వైరస్కి కారణం అక్కడి ఆహారపు అలవాట్లేననే ఆరోపణలున్నాయి. అక్కడి మాంసం విక్రయశాలలు దీనికి ప్రధాన కేంద్రబిందువని భావిస్తున్నారు. అయితే స్వల్ప కాలంలోనే వేల మందిని బలితీసుకున్న ఈ వైరస్ కారణంగా చైనా అక్కడి జంతు, సముద్రపు జీవుల విక్రయశాలలను మూసివేసింది. తాజాగా చైనాలో ఈ వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. మరణాలు, కేసుల సంఖ్య తగ్గినట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ సమయంలో అక్కడ మళ్లీ మాంసం విక్రయశాలలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో గబ్బిలాలు, పిల్లులు, కుక్కల మాంసం విక్రయాలు ఊపందుకున్నాయి. దీనికి సంబంధించిన విషయాన్ని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, పరిశోధకులనుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయకుండా అక్కడి అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. మార్కెట్లలో దీనికోసం ప్రత్యేకంగా సెక్యూరిటీని నియమించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్న సందర్భంలో జంతు విక్రయాలకు అనుమతించడం ద్వారా చైనా గుణపాఠం నేర్చుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.
చైనాలో ప్రారంభమైన కొవిడ్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటికే వేల ప్రాణాలను బలితీసుకున్న ఈ మహమ్మారితో ప్రపంచం మొత్తం అత్యంత అరుదైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ దుర్భర
పరిస్థితికి కారణం చైనానే అని అమెరికా అధ్యక్షుడు పలుమార్లు ఆరోపించారు. అక్కడితో ఆగకుండా ఈ వైరస్ ను ‘చైనా వైరస్’, ‘వుహాన్ వైరస్’ అని అమెరికా పిలుస్తోంది. వుహాన్ నగరంలోనే కరోనా వైరస్ తొలికేసు నమోదైనట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ధృవీకరించింది. గత నవంబరులోనే మొదటి కేసు నమోదైనట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వుహాన్లోని ఓ సముద్రపు జీవుల విక్రయశాల నుంచి ఈ వైరస్ వైరస్ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. విస్తృత వేగంతో వ్యాపించిన ఈ మహమ్మారి చైనాలో 3వేలకు పైగా ప్రజల ప్రాణాలను బలితీసుకుంది. మరో 80వేల మంది దీని బారినపడ్డారు. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం వైరస్ వ్యాప్తి కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది. మాంసం విక్రయశాలలను మూసివేసింది. అయితే తాజాగా వీటిని తెరవడం ఆందోళనకు గురిచేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ