JKలో స్థిర నివాసంపై మార్గదర్శకాలు
జమ్ము కశ్మీర్లో స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలతో కూడిన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు జమ్ము కశ్మీర్లోని 138 చట్టాలకు సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో స్థానికంగా.....
దిల్లీ: జమ్ము కశ్మీర్లో స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలతో కూడిన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు జమ్ము కశ్మీర్లోని 138 చట్టాలకు సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో స్థానికంగా ఉండే వారికి గ్రూప్-4 స్థాయి వరకు ఉన్న ఉద్యోగాల్లో భద్రతను కల్పిస్తూ జమ్ము కశ్మీర్ సివిల్ సర్వీస్ చట్టంలో మార్పులు చేసినట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. దాని ప్రకారం బయటి వ్యక్తులు ఎవరికి గ్రూప్-4 స్థాయి వరకు ఉండే ఉద్యోగాలు పొందేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. కేవలం జమ్ము కశ్మీర్కు చెందిన వ్యక్తులు మాత్రమే అందుకు అర్హులని తెలిపింది. దానితో పాటు నిబంధనల ప్రకారం ఎవరైనా 15 సంవత్సరాల పాటు స్థానికంగా నివసించినట్లయితే వారికి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు అర్హతను కల్పిస్తూ ప్రత్యేక నిబంధనను ప్రవేశపెట్టింది. అంతే కాకుండా 10 సంవత్సరాల పాటు జమ్ము కశ్మీర్లో సేవలందించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, చట్టబద్ధమైన సంస్థలు, సెంట్రల్ యూనివర్శిటి, కేంద్ర ప్రభుత్వం గుర్తింపుపొందిన పరిశోధన సంస్థల ఉద్యోగుల పిల్లలు స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు అర్హులుగా అందులో పేర్కొంది.
ఇంకా ఏడు సంవత్సరాల పాటు జమ్ముు కశ్మీర్లో చదువుకుని పది, పన్నెండు తరగతుల పరీక్షలకు హాజరైన వారు కేంద్ర పాలిత ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చని తెలిపింది. అంతే కాకుండా సహాయ పునరావాస కమిషనర్ చేత వలస వచ్చిన వారిగా గుర్తింపబడిన వ్యక్తు స్థానికంగా నివాసం ఏర్పరచుకునేందుకు అర్హులుగా పేర్కొంది. వారితో పాటు జమ్ము కశ్మీర్ స్థానికత కలిగి ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం బయట ప్రాంతాల్లో నివసిస్తున్న వారి పిల్లలు కూడా ఇందుకు అర్హులుగా నోటిఫికేషన్లో పేర్కొంది. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను రద్దు చేస్తూ గతేడాది కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఉమ్మడి జమ్ముకశ్మీర్ను జమ్ము-కశ్మీర్, లద్దాక్ ప్రాంతాలుగా విభజించారు. వీటిల్లో జమ్ము-కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కాగా.. లద్దాఖ్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించింది. ఇందులో భాగంగా జమ్ము కశ్మీర్లోని 138 చట్టాలలో 28 చట్టాలను రద్దు చేసింది.
అయితే కేంద్రం నిర్ణయాన్ని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తప్పుబట్టారు. ‘‘కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంతో దాని నివారణపై దృష్టి పెట్ట్టకుండా ప్రభుత్వం జమ్ము కశ్మీర్ స్థిర నివాసానికి సంబందించి కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అంతే కాకుండా సవరించిన చట్టాలు గతంలో చెప్పిన విధంగా ఎటువంటి భద్రతను కల్పించడం లేదు’’ అని ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM