కరోనాపై అసత్య ప్రచారమా? ఫిర్యాదు చేయండిలా..!

కొవిడ్-19ను గురించి అబద్దపు సమాచారాన్ని సోషల్‌ మీడియాలో గమనించినట్లయితే తమకు తెలియచేయాలని పీఐబీ యూజర్లను కోరింది.

Published : 02 Apr 2020 14:44 IST

కరోనా రోగిపై అసత్యప్రచారం, ముగ్గురి అరెస్టు

ఇంటర్నెట్‌ డెస్క్‌‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) సోకిన ఓ రోగి గురించి సోషల్‌ మీడియాలో వదంతులు ప్రచారం చేసినందుకు ఒక మహిళతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఒడిశాలోని భద్రక్‌ పట్టణంలో చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌కు మాత్రమే కాకుండా కరోనాకు సంబంధించిన అబద్ధపు ప్రచారాన్ని నిరోధించటానికి ముందుకు రావాలని ప్రభుత్వ రంగ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది. కొవిడ్-19ను గురించి అబద్ధపు సమాచారాన్ని సోషల్‌ మీడియాలో గమనిస్తే తమకు తెలియచేయాలని సంస్థ యూజర్లను కోరింది. ఇందుకుగానూ ఆ వార్త స్క్రీన్‌షాట్‌ లేదా లింక్‌ను 87997 11259 అనే వాట్సాప్‌ నంబరుకు లేదా pibfactcheck@gmail.com మెయిల్‌ ఐడీకి పంపించాలని పీఐబీ తెలిపింది. 

కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచానికే ప్రమాదంగా మారిందని... ఈ నేపథ్యంలో తప్పుడు సమాచారానికి, అబద్ధపు వార్తలకు సోషల్‌ మీడియా వేదిక కారాదని ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది. కాగా ఈ విధమైన సమాచారాన్ని తమ ఫ్లాట్‌ఫాంల నుంచి తొలగించాలని, యథార్థ సమాచారాన్ని మాత్రమే అందుబాటులో ఉంచాలని సోషల్‌ మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసింది. యూజర్లు ఈ విధమైన అబద్ధపు వార్తలను అప్‌లోడ్‌ చేసి, వాటికి ప్రచారం కల్పించకుండా అవగాహనా ఉద్యమాలను చేపట్టాలని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలకు సూచించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని