కరోనా కాటుకు 6వారాల చిన్నారి మృతి!
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి వేల సంఖ్యలో ప్రాణాలను తీసుకుంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాస్తంగా దాదాపు 47వేల మందిని బలితీసుకుంది. వీరిలో అత్యధికంగా అమెరికా, యూరప్లోనే చనిపోతుండడం విచారకరం.
కనెక్టికట్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి వేల సంఖ్యలో ప్రాణాలను తీసుకుంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాస్తంగా దాదాపు 47వేల మందిని బలితీసుకుంది. వీరిలో అత్యధికంగా అమెరికా, యూరప్లోనే చనిపోతుండడం విచారకరం. ఇదిలా ఉంటే తాజాగా కరోనా సోకిన ఆరు వారాల చిన్నారి మృతి చెందింది. అమెరికాలో ఇంత తక్కువ వయసుగల చిన్నారి మృతిచెందడం ఇదే తొలిసారి. అమెరికాలోని కనెక్టికట్కు చెందిన ఆరువారాల చిన్నారి కరోనాతో మృతిచెందినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ నెడ్ లామోంట్ ట్విటర్లో వెల్లడించారు. దీంతో ఈ వైరస్ ఏవయస్సువారికీ సురక్షితం కాదనే అంశం స్పష్టమవుతోందన్నారు. కరోనా వైరస్ లక్షణాలతో అచేతన స్థితిలోఉన్న చిన్నారిని గతవారం ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం చిన్నారి మరణించిందని వైద్యులు ప్రకటించారు. కాగా వైద్య పరీక్షల్లో చిన్నారికి కరోనా వైరస్ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. కొవిడ్-19 కారణంగా చిన్నారి మరణించడం తీవ్రంగా కలచివేసిందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అవడం వలన తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. అయితే, గతవారం అమెరికాలోని ఇల్లినోయిస్ నగరానికి చెందిన తొమ్మిది నెలల చిన్నారి కూడా కొవిడ్-19తో మరణించినట్లు అధికారులు తెలిపారు.
కనెక్టికట్లో ఇప్పటివరకు కరోనా వైరస్తో 85 మంది మరణించగా బాధితులు సంఖ్య 3557గా ఉంది. కేవలం నిన్న ఒక్కరోజే ఇక్కడ 429పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు ప్రకటించారు. అమెరికాలో అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా మహమ్మారితో 5వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 2లక్షలకు పైగా ఈ వైరస్ బారినపడ్డారు. ముఖ్యంగా న్యూయార్క్ నగరం కరోనా వైరస్ విజృంభణతో ఉక్కిరిబిక్కిరవుతోంది. న్యూయార్క్ రాష్ట్రంలో 2వేలకు పైగా మరణాలు సంభవించగా కేవలం ఈ ఒక్క నగరంలోనే వెయ్యి మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 83వేల మంది వైరస్కు బాధితులుగా మారారు. గడచిన 24గంటల్లోనే ఇక్కడ 8వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో అత్యధిక కేసులు న్యూయార్క్లోనే నమోదవుతున్నాయి. అయితే చిన్నారి మరణించిన కనెక్టికట్ కూడా న్యూయార్క్ నగరానికి సమీపంలోనే ఉండడంతో వైరస్ తీవ్రత అక్కడ పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ సందర్భంలో చిన్నారులు, వృద్ధులపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే వయసుతో తేడా లేకుండా యువకులు కూడా ఈ వైరస్ బారినపడి మరణిస్తుండడం గమనార్హం.
ఇవీ చదవండి..
అమెరికాలో ఒక్కరోజే 884 మరణాలు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?