రెండేళ్ల జీతాన్ని విరాళంగా ప్రకటించిన గంభీర్

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ...

Published : 02 Apr 2020 13:10 IST

న్యూదిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకూ తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ తన ఉదారతను చాటుకున్నారు. కరోనాపై జరుగుతున్న పోరులో తమ వంతు సాయంగా రెండేళ్ల వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 

‘దేశం మనకోసం ఏం చేసింది? అని ప్రజలు అడుగుతున్నారు. కానీ, నిజమైన ప్రశ్న ఏంటంటే.. నీ దేశానికి నువ్వు ఏం చేశావు?’ నా వంతుగా రెండు సంవత్సరాల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నానని. మరి మీరు..?’ అని పీఎం మోదీ, జేపీ నడ్డా, భాజపా దిల్లీ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో జతచేసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడిబాధితుల సంఖ్య  1965కి చేరిందని.. వీరిలో 50 మంది మృతి చెందగా 1764 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని