కశ్మీర్లో 9మంది ఉగ్రవాదుల హతం
కశ్మీర్లో గడిచిన 24 గంటల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. దక్షిణ కశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల్లో ఇటీవల నలుగురు
కశ్మీర్: కశ్మీర్లో గడిచిన 24 గంటల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. దక్షిణ కశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల్లో ఇటీవల నలుగురు పౌరులు మృతి చెందారు. పౌరులపై దాడి తర్వాత భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాల కాల్పుల్లో బత్పురా వద్ద నిన్న నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇవాళ ఉదయం కెరాన్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద ఐదుగురు ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారు. కెరాన్ సెక్టార్ వద్ద నియంత్రణరేఖ దాటి భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముష్కరులను గుర్తించిన సైనికులు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. ఎదురుకాల్పుల్లో ఒక జవాను మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. నియంత్రణ రేఖ సమీపంలో ముష్కరులు దాగి ఉన్నారేమోనన్న అనుమానంతో కూంబింగ్ కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!