ధారావిలో కరోనా: మమ్మల్ని దేవుడే కాపాడాలి
ధారవికి చెందిన 56ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ సోకి చనిపోవటంతో ముంబయి ఒక్కసారి ఉలిక్కిపడింది. ఆ వివరాలు మీ కోసం...
దేశంలో అతిపెద్ద మురికివాడ వాసుల ఆక్రందన
ముంబయి: రజనీకాంత్ నటించిన ‘కాలా’ చూసిన వారికి బాగా పరిచయమున్న పేరు ధారావి. దేశ ఆర్థిక రాజధాని అని పిలిచే ముంబయి, ఆసియాలో అతిపెద్ద మురికివాడల్లో ఇది ఒకటి. ఇక్కడ 56ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ సోకి చనిపోవటంతో ముంబయి ఒక్కసారి ఉలిక్కిపడింది. నగరంలోని ప్రముఖ వాణిజ్య ప్రాంతాలకు, ముంబయి స్టాక్ ఎక్స్చేంజీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధారావిలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయకపోతే ముంబయి మహానగరం ఆపదలో పడుతుంది.
ఇదీ ధారావి...
పదిలక్షల జనాభా ఉన్న ధారావిలో అధిక భాగం వలసకూలీలు. 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉన్న ‘ఇంట్లో’ 10 నుంచి 12 మంది నివసిస్తుంటారు. ఈ ప్రాంతంలో 80 మంది వ్యక్తులకు ఒకే టాయిలెట్ ఉంటుందంటే ఇక్కడ జీవన ప్రమాణాలు, జనసాంద్రత ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. టార్ఫలిన్లు కప్పిన గుడిసెల్లో ఇక్కడ వందల దుకాణాలు నడుస్తాయి.
ధారావిలో కరోనా...
ధారావిలో మొదటి కరోనా కేసు నమోదైన వెంటనే ఆ ప్రాంతానికే చెందిన ఓ వైద్యుడు (35), మరో మహిళ (30)కు కూడా కొవిడ్-19 ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇక ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మరో ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల వ్యక్తి కరోనా సోకి, చికిత్స తీసుకుంటున్నాడు. ఇంకా 25 మంది అనుమానితుల ఫలితాలు వెలువడాల్సి ఉంది. అధికారులు ఇప్పటి వరకు ధారావికి చెందిన 3,000 మందిని క్వారంటైన్కు తరలించారు.
ఏం జరుగుతోంది?
ధారావిలో తొలి కరోనా మృతుడు ఉండే కాలనీ నుంచి ఏ ఒక్కరూ బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. అతను నివసించిన భవనాన్ని పూర్తిగా సీల్ చేశారు. ధారావి సమీపంలో ఉన్న ఓ స్పోర్ట్స్ క్లబ్ను 300 పడకల ఐసోలేషన్ కేంద్రంగా మార్చారు. మరో 50 పడకల ఆస్పత్రిని కొవిడ్ నిర్ధారణ, చికిత్సల కోసం కేటాయించారు. ధారావి ప్రజలకు ఉచితంగా ఆహారం, నీరు అందచేస్తున్నారు. ఒక్క ధారావి ప్రాంతంలోనే ఆరు వైద్య బృందాలు, 170 మంది వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు.
ఇరకాటంలో అధికారులు
ధారావిలో కరోనా మృతి చెందిన వ్యక్తి తన ఏడుగురు కుటుంబ సభ్యులతో ఉండేవాడు. నాలుగు లీటర్ల నీటిని రూ.25 చెల్లించి కొనుగోలు చేసే పరిస్థితిలో ఉన్న వారిని తరచూ చేతులు కడుక్కోవాలి చెప్పటం ఎలా అని అధికారులు వాపోతున్నారు. మరుగుదొడ్లే లేని ఇళ్లలో ఉంటున్న ధారావి ప్రజలను ఇల్లు వదిలి బయటకు రాకూడదని ఎలా నిర్బంధించాలో తెలియక అధికారులు తికమక పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న ధారావిలో అంటువ్యాధి విస్తరణ అతి వేగంగా జరిగే ప్రమాదముంది. అంతే కాకుండా హోం క్వారంటైన్ విధానం కూడా ఫలితాన్నిచ్చే అవకాశాలు తక్కువే. ఇక కరోనా సోకిన వ్యక్తుల కుటుంబ సభ్యులు రకరకాల కారణాల వల్ల సహకరించకపోవటం అధికారులకు పెద్ద సమస్యగా మారింది.
ఆదివారం నాటికి అందిన సమాచారం ప్రకారం... దేశంలోని కరోనా కేసుల్లో పదోవంతు, కరోనా మరణాల్లో సగం ముంబయి నగరం నుంచే నమోదయ్యాయి. దీనితో ఈ నగరాన్ని కరోనా రెడ్జోన్ ప్రాంతంగా ప్రకటించారు. ధారావిలోని దుస్తుల తయారీ కేంద్రాల్లో లక్షమంది పేద కార్మికులు పనిచేస్తున్నారు. వ్యాపారాలు మూతపడటంతో వారు తమ ఉపాధిని గురించి, కుటుంబ పోషణ గురించి, పోలీసుల ఆంక్షలను గురించి వారు ఆవేదనకు గురవుతున్నారు. ఈ ప్రాంతాన్ని సీజ్ చేయటానికి వెళ్లిన అధికారులపై రాళ్లు విసిరారు. అయితే దేశంలోని మిగిలిన ప్రజల్లాగే ధారావి ప్రజలకు కూడా కరోనా అంటే భయం ఉంది. తమ ప్రాంతంలో కరోనా వేళ్లూనితే పరిస్థితి ఎలా ఉంటుందో అని తలుచుకోవటానికే అక్కడి ప్రజలు వణికి పోతున్నారు. రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చిన మరుక్షణం తమ స్వగ్రామాలకు చేరుకోవాలని వీరు ఆతృతతో ఉన్నారు. తమ రోగ నిరోధకత, లేదా ఆ భగవంతుడే తమను కరోనా మహమ్మారి బారి నుంచి కాపాడాలని ధారావి నివాసులు ఆక్రోశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారిలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని నింపటమే ప్రస్తుతం ప్రభుత్వాధికారుల తక్షణ కర్తవ్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు