టెస్టుల్లో చిక్కని కరోనా వైరస్?
మానవాళికే సవాల్ విసురుతున్న కరోనా వైరస్ను కట్టడిచేసేందుకు అన్ని దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక కొవిడ్-19 కారణంగా అమెరికాలో వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడటం కలవరపెడుతోంది.
నిర్ధారణ పరీక్షలపై నిపుణుల హెచ్చరిక!
వాషింగ్టన్: మానవాళికే సవాల్ విసురుతున్న కరోనా వైరస్ను కట్టడిచేసేందుకు అన్ని దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక కొవిడ్-19 కారణంగా అమెరికాలో వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడటం కలవరపెడుతోంది. ఇంతభారీ స్థాయిలో జరుగుతున్న మరణాలకుగల కారణాలను విశ్లేషిస్తున్నారు నిపుణులు. అయితే ఈ వైరస్ను వ్యాప్తిని అరికట్టడంలో అసలు దీన్ని గుర్తించడమే అత్యంత కీలకం. దీనికోసం కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తులతోపాటు అనుమానితులకు కూడా కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని సమయాల్లో వైరస్ ఉన్నవ్యక్తుల్లో లక్షణాలు బయటపడకపోవడం చూశాం. తాజాగా వైరస్ ఉన్న వ్యక్తులకు నిర్ధారణ పరీక్ష నిర్వహించగా ఫలితం నెగిటివ్ వచ్చే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిణామంతో వైరస్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొవిడ్ నిర్ధారణ పరీక్ష విధానం ఒక కారణంగా విశ్లేషిస్తున్నారు.
కరోనా వైరస్ను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పీసీఆర్(పాలీమెరేస్ చైన్ రియాక్షన్) పరిజ్ఞానాన్ని అనుసరిస్తున్నారు. ఈ స్వాబ్ విధానం ద్వారా అతిసూక్ష్మమైన నమూనాలను వ్యక్తి ముక్కు, గొంతు నుంచి సేకరించి ల్యాబ్కు పంపుతారు. అత్యంత కీలకమైన ఈ దశలో..నమూనాలు సేకరించే సమయంలో అనేక అంశాలు ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. తుమ్మడం, దగ్గడం ద్వారా ఎంత బయటకు వస్తోంది?, వీటిని సేకరించడం, పరీక్షలకోసం తరలించే సమయం వంటి అంశాలు ఫలితంపై ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. గడచిన నాలుగునెలలుగా ప్రపంచదేశాల్లో విస్తృతంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్ కేవలం వ్యక్తుల మధ్యే సంక్రమిస్తున్నదని పలు నివేదికలు స్పష్టంచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ప్రస్తుతం అనుసరిస్తున్న కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు ప్రాథమికమైనవిగానే భావించాలని అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణురాలు ప్రియా సంపత్ అభిప్రాయపడ్డారు.
కరోనా వైరస్ ఉన్న వ్యక్తుల్లో కేవలం 60నుంచి 70శాతం మాత్రమే పాజిటివ్గా బయటపడుతున్నట్లు చైనా నివేదికలు సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకవేళ దీన్ని 90శాతానికి పెంచిగలిగితే పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు. నిర్ధారణ పరీక్ష కచ్చితంగా లేనట్లయితే ఒక్కశాతం తప్పుగా సూచించే కేసులు కూడా కొత్తగా వేల పాజిటివ్ కేసులకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే క్లినికల్ డయాగ్నసిస్ ఎంతో కీలకమని సూచిస్తున్నారు. ఈ సమయంలో కేవలం శాంపిల్స్ తీసుకోవడమే కాకుండా రోగి లక్షణాలు, ఆరోగ్య చరిత్ర, ఇమేజింగ్తో పాటు మరిన్ని పరీక్షలు నిర్వహించమే ఉత్తమమని అంటున్నారు. అత్యంత కీలకమైన ఈ నమూనాల సేకరణలో శ్వాసకోస భాగాల నుంచి తీసుకునేవారికి నైపుణ్యం ఉండాలి. అంతేకాకుండా కచ్చితమైన నమూనాలు తీసుకున్నప్పటికీ పరీక్ష నిర్వహించడంలో జరిగే పద్ధతులవలన ఫలితాల్లో తేడాలొచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం రోగి నుంచి కఫం వంటి నమూనాలు సేకరించడం ఉత్తమమైందని సూచిస్తున్నారు.
అమెరికాలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న దృష్ట్యా లక్షల సంఖ్యలో ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది. నైపుణ్యం లేనివారు, ఫార్మసిస్టులు కూడా చేసే ఈ ప్రక్రియలో కొంత తేడా వచ్చినా కరోనా సోకిన వారిని గుర్తించడం కష్టంగా మారుతుంది. నిర్ధారణ పరీక్షలో ఉన్న లోపాలతో వైరస్ ఉన్న వ్యక్తికి నెగిటివ్ నివేదిక ఇచ్చినట్లయితే అతను వైరస్ సోకలేదనే భావనతో ఉండే అవకాశం ఉంటుంది. దీంతో అతని నుంచి మరింతమందికి వైరస్ సోకే ఆస్కారం ఉంటుందని జాన్ హాప్కిన్స్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యుడు డేనియల్ బ్రెన్నెర్ హెచ్చరిస్తున్నారు.
ఈ సమయంలో కేవలం స్వాబ్ పరీక్షలే సరిపోవని కొత్తగా సెరొలాజికల్ పద్ధతి మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రక్తనామూనాలు తీసుకుని చేసే ఈ పద్ధతి ద్వారా ఓ వ్యక్తి ఇదివరకు వైరస్ బారిన పడ్డాడా?లేదా అనే విషయం కచ్చితంగా తెలుస్తుందంటున్నారు. దీనికోసం అమెరికా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు ప్రియా సంపత్ వెల్లడించారు. ఏదేమైనా కరోనా నిర్ధారణ పరీక్షలు కచ్చితంగా చేసినపుడే వైరస్ వ్యాప్తిని నిరోధించగలమని సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా