హైటెక్‌ ఐసోలేషన్‌..రోబో సాయం

ఇప్పుడు ఏ నోట విన్నా కరోనాయే. యావత్‌ ప్రపంచాన్ని ఈ విష క్రిమి గడగడలాడిస్తోంది. ఎదుటి వారిని ఆప్యాయంగా హత్తు కోవాలన్నా అడ్డు తగులుతోంది. కరోనా బారిన పడిన వారికి సాయమందించేందుకు సొంత కుటుంబ సభ్యులనే దరి చేరకుండా చేస్తోంది ఈ మహమ్మారి. వైద్య నిపుణులు సైతం కరోనా వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారికి దూరంగా ఉండటమే...

Published : 14 Apr 2020 22:32 IST

రాంచీ: ఇప్పుడు ఏ నోట విన్నా కరోనాయే. యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎదుటి వారిని ఆప్యాయంగా హత్తు కోవాలన్నా అడ్డు తగులుతోంది. కరోనా బారిన పడిన వారికి సాయమందించేందుకు సొంత కుటుంబ సభ్యులనే దరి చేరకుండా చేస్తోంది ఈ మహమ్మారి. వైద్య నిపుణులు సైతం కరోనా వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారికి దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ సోకిన వారికి వైద్య మందించేందుకు ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌బమ్‌ జిల్లా అధికారులు సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు.

వైద్యులకు, వైద్య సిబ్బందికి వైరస్‌ సోకకుండా వారి స్థానంలో రోబోలను వినియోగిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు రోబోలే బాధితుల దగ్గరికి వెళ్లి వైద్యం, ఆహారం అందించేలా వీటిని తయారు చేశారు. ఈ మేరకు జిల్లా అభివృద్ధి సహాయ కమిషనర్‌ ఆదిత్య రంజన్‌ వెల్లడించారు. ఈ సేవలు ఇవాళ్టి నుంచే అందుబాటులోకి వచ్చాయని మీడియాకు తెలిపారు. వరుసగా 20, 30 పడకల సామర్థ్యంలో ఏఎన్‌ఎం స్కిల్ సెంటర్‌, చక్రధర్‌పూర్‌ రైల్వే ఆస్పత్రుల్లో ‘హైటెక్‌ ఐసోలేషన్‌’ వార్డులను ప్రారంభించామని తెలిపారు. ఇక్కడ వైద్య సిబ్బంది స్థానంలో రోబోలే సేవలందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని