కరోనా నిర్థారణ పరీక్షలు ఎలా చేస్తారంటే..!
ప్రపంచం మొత్తం కరోనాపై పోరు సాగిస్తున్న వేళ వైద్య పరిభాష తెలియని సామాన్యుడి మదిలో ఎన్నో ప్రశ్నలు. రాపిడ్ యాంటీబాడీస్ టెస్ట్, ఆర్టీ-పీసీఆర్ టెస్ట్, వంటి పదాలు తెలియని ఎంతో మందికి వాటి గురించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేశారు....
దిల్లీ: ప్రపంచం మొత్తం కరోనాపై పోరు సాగిస్తున్న వేళ వైద్య పరిభాష తెలియని సామాన్యుడి మదిలో ఎన్నో ప్రశ్నలు. రాపిడ్ యాంటీ బాడీస్ టెస్ట్, ఆర్టీ-పీసీఆర్ టెస్ట్, వంటి పదాలు తెలియని ఎంతో మందికి వాటి గురించి పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేశారు వైద్యులు. మరి అవేంటో మనం తెలుసుకుందామా. ప్రస్తుతం భారత్లో కరోనా నిర్థారణకు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్, రాపిడ్ యాంటీబాడీస్ టెస్ట్ అనే రెండు పద్ధతులను అవలంబిస్తున్నారు.
ఆర్టీ-పీసీఆర్ టెస్ట్
రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్టీ-పీసీఆర్) అనేది ల్యాబ్లో ఆర్ఎన్ఏను డీఎన్ఏగా మార్చే ప్రక్రియ. యాంటీబాడీ టెస్టుల్లో భాగంగా వైరస్ను కనుగొని దానికి శరీరం ఏవిధంగా స్పందిస్తుంది అనేది ఈ పరీక్షల్లో నిర్థారిస్తారు. ఇందు కోసం రోగి శరీరంలోని శ్వాస మార్గం, గొంతు, ముక్కు నుంచి నమూనాలకు సేకరిస్తారు. వీటి ఫలితాల కోసం 12 నుంచి 24 గంటల సమయం పడుతుంది. ఇది ఎంతో ఖరీదైంది.
రాపిడ్ యాంటీబాడీస్ టెస్ట్
ఈ పరీక్షల్లో ఖర్చు తక్కువ, ఫలితం కూడా కేవలం 20 నుంచి 30 నిమిషాల్లో తెలుస్తుంది. వీటిలో వైరస్పై ప్రతి స్పందించేదుకు వ్యక్తి శరీరంలో యాంటీబాడీలు తయారయ్యా? లేదా అనేది ఈ పరీక్షల్లో తెలుస్తుంది. ఒక వేళ యాంటీబాడీలు ఉత్పత్తి అయితే పాజిటివ్, కాకపోతే నెగటివ్ అని ఫలితాలను నిర్థారిస్తారు. ఈ పరీక్షలు ఎక్కువగా కరోనా అనుమానితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అంటే కరోనా ప్రజ్వలన కేంద్రాలుగా గుర్తింపబడిన ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో కరోనా సోకినప్పటికీ యాంటీబాడీలు ఉత్పత్తవ్వని కారణంగా పరీక్షల సమయంలో నెగటివ్ వచ్చి మరి కొద్ది రోజుల తర్వాత సదరు వ్యక్తికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ రావడం జరిగిందని వైద్యులు తెలిపారు. ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించిన వారిలో వైరస్ వ్యాప్తి ఈ విధంగా జరిగిందని అన్నారు.
ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు ప్రభుత్వ ల్యాబ్స్లో ఉచితం అయినప్పటికీ, ప్రైవేటు ల్యాబ్లు వీటి కోసం రూ.4500 వసూలు చేస్తున్నాయి. సోమవారం సుప్రీం కోర్టు ప్రైవేట్ ల్యాబ్లు కూడా ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు కరోనా నిర్థారణ పరీక్షలు ఉచితంగా చేయాలని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేసింది. అయితే ఈ పరీక్షలు ఎంత మేర ప్రభావంతంగా పనిచేస్తాయనేది రోగి వైరస్ బారిన పడిన సమయం నుంచి అతడిలో వైరస్ తీవ్రత, ఆ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాల నాణ్యత, వాటిని ఏ విధంగా ప్రాసెస్ చేశారు, పరీక్షలకు ఉపయోగించే కిట్లలోని కచ్చితత్వం వంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)