ఇక విమానాశ్రయంలోనే కరోనా నిర్ధారణ!
విమానయానంతో ఎంత వేగంగా ప్రయాణించామో, కరోనా వైరస్ కూడా ప్రపంచదేశాలకు అంతే వేగంగా పాకింది. విమాన ప్రయాణాలు చేసే వారిలో వైరస్ ఎవరికి ఉందో? ..
రక్త పరీక్షలతో కేవలం 10నిమిషాల్లోనే ఫలితం!
దుబాయ్: విమానయానంతో ఎంత వేగంగా ప్రయాణించామో, కరోనా వైరస్ కూడా ప్రపంచదేశాలకు అంతే వేగంగా పాకింది. విమాన ప్రయాణాలు చేసే వారిలో వైరస్ ఎవరికి ఉందో? లేదోనని తెలుసుకోలేకపోవడం వైరస్ ఇంత వేగంగా వ్యాపించడానికి ఓ కారణం. ఇప్పటివరకూ విదేశీ ప్రయాణం చేసేవారికి కేవలం స్క్రీనింగ్ మాత్రమే నిర్వహించి కరోనా లక్షణాలు గుర్తించేవారు. కానీ, కరోనా వైరస్ను అతి తక్కువ సమయంలోనే గుర్తించే సాంకేతికత ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. విమానాశ్రయాల్లో రాపిడ్ కిట్ల సాయంతో కేవలం పది నిమిషాల్లోనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష నిర్వహించే సదుపాయాన్ని ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ తాజాగా ప్రారంభించింది. ఇలా విమానాశ్రయాల్లో కొవిడ్-19 నిర్ధారణ పరీక్ష చేయడం ఇదే తొలిసారని సదరు సంస్థ వెల్లడించింది.
దుబాయ్లో విమాన సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేశామని ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ ఉన్న విదేశీయులు వారి స్వదేశాలకు వెళ్లాలనుకునే వారి కోసమే ఈ సర్వీసులను నడుపుతోంది. దీనిలో భాగంగా తొలుత దుబాయి నుంచి టునీషియా వెళ్లిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. విమాన ప్రయాణం ప్రారంభం కాకముందే ప్రయాణీకుల రక్త నమూనాలు సేకరించి కరోనా వైరస్ పరీక్ష చేస్తారు. వీటి ఫలితం కేవలం పది నిమిషాల్లోనే వస్తుందని ఎమిరేట్స్ సంస్థ తెలిపింది. రాబోయే రోజుల్లో ఇదే పద్ధతిని అన్నిరకాల విమానాల్లో అమలు చేస్తామని విమానయాన అధికారులు పేర్కొన్నారు.
అరబ్ దేశాల్లో ఇప్పటివరకు దాదాపు 5వేల మందికి కరోనా సోకగా 28మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు లాక్డౌన్తో పాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం