దేశవ్యాప్తంగా 325 జిల్లాల్లో కరోనా లేదు!

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 325 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. మరో 27 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్త కేసులు నమోదవ్వలేదని తెలిపింది. పుదుచ్చేరిలోని మహి జిల్లాలో......

Published : 17 Apr 2020 01:20 IST

దిల్లీ: దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 325 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. మరో 27 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్త కేసులు నమోదవ్వలేదని తెలిపింది. పుదుచ్చేరిలోని మహి జిల్లాలో గత 28 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 12,759 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. 420 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1515 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 826 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని