ఇక రెండు గంటల్లోనే కొవిడ్-19 నిర్ధారణ?
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్ను అడ్డుకోవడంలో ఈ వైరస్ను గుర్తించడమే అత్యంత కీలకం. వైరస్ను ఎంత తొందరగా నిర్ధారిస్తే అంత ఎక్కువగా దీని వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ సమయంలోనే వైరస్ నిర్ధారణ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.
తిరువనంతపురం: ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్ను అడ్డుకోవడంలో ఈ వైరస్ను గుర్తించడమే అత్యంత కీలకం. వైరస్ను ఎంత తొందరగా నిర్ధారిస్తే అంత ఎక్కువగా దీని వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ సమయంలోనే వైరస్ నిర్ధారణ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా కేవలం రెండు గంటల్లోనే వైరస్ను నిర్ధారించే సాంకేతికతను రూపొందించింది కేరళకు చెందిన ఓ సంస్థ. అంతేకాదు తక్కువ సమయంతో పాటు తక్కువ ధరకే ఈ నిర్ధారణ పరీక్ష సాధ్యమంటోంది.
తిరువనంతపురానికి చెందిన ‘చిత్రా తిరుణాల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్’ కేవలం రెండు గంటల్లోనే కొవిడ్-19 నిర్ధారణ పరీక్ష ఫలితాన్నిచ్చే సాంకేతికతను రూపొందించింది. కొవిడ్-19 కు కారణమయ్యే SARS-CoV-2ని రెండు గంట్లోనే గుర్తించే ఈ పరీక్షకు కేవలం వెయి రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని చెబుతోంది. అయితే దీనికి ఇంకా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అనుమతి లభించాల్సి ఉంది.
ప్రస్తుతం భారత్తోపాటు ప్రపంచంలోని చాలా దేశాలు కొవిడ్-19 నిర్ధారణ కోసం RT-PCR పద్ధతిని అనుసరిస్తున్నారు. స్వాబ్ ద్వారా(ముక్కు, గొంతు భాగాల నుంచి) నమూనాలు సేకరించి పరీక్షించే ఈ విధానంలో తుది ఫలితం కోసం దాదాపు ఐదు గంటలు పడుతోంది. అంతేకాకుండా ఖర్చుతో కూడకున్న పని. ప్రస్తుతం ఈ పరీక్ష చేయడానికి రూ.4500 వసూలు చేస్తున్నారు. అయితే కొత్తగా రూపొందించిన ఈ సాంకేతికతలో RT-LAMP పద్ధతిని ఉపయోగిస్తామని దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ వెల్లడించింది.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న విధానం కన్నా ఇది ఎంతో త్వరగా కచ్చితత్వంతో ఫలితాన్ని ఇస్తుందని తెలిపింది. తద్వారా తక్కువ సమయంలో ఎక్కవ నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని పేర్కొంది. అయితే ప్రస్తుతానికి అలెప్పీలోని జాతీయ వైరాలజీ కేంద్రంలో ఈ కిట్లు ధ్రువీకరణ పొందగా ఐసీఎంఆర్ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. అనుమతి లభించిన అనంతరం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.
ప్రస్తుతం వినియోగిస్తోన్న PCR సాంకేతికలో ఉపయోగించే మిషన్ ఖరీదు 15 నుంచి 30 లక్షలు ఉండగా.. ఈ కొత్త టెక్నాలజీలో దీని ఖర్చు రెండున్నర లక్షలేనని సదరు సంస్థ పేర్కొంది. ఏదేమైనా ఇలాంటి సాంకేతికత అందుబాటులోకి రావడం వలన ఎక్కవ సంఖ్యలో కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..