ఇది కంటికి కనపడని యుద్ధం

కరోనాపై పోరాడుతూ మానవ చరిత్రలోనే కంటికి కనిపించని అతిపెద్ద యుద్ధం చేస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంటూ..

Published : 19 Apr 2020 17:42 IST

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

దిల్లీ: కరోనాపై పోరాడుతూ మానవ చరిత్రలోనే కంటికి కనిపించని అతిపెద్ద యుద్ధం చేస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంటూ కొవిడ్‌-19ను కట్టడిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో కరోనా వైరస్‌ను రూపుమాపేందుకు అన్ని ప్రభుత్వ సంస్థలు కలిసికట్టుగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. సమాచార మార్పిడిలో సాయుధ బలగాలు, గొలుసు సరఫరా నిర్వహణ విభాగం, వైద్య విభాగం, ఇంజినీరింగ్‌ శాఖ తమ విధులు సమర్థంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని